(1 / 8)
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ 12 నుంచి ప్రారంభించనుంది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని తాజాగానే ప్రభుత్వం సూచించింది.
(2 / 8)
ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.
(3 / 8)
తల్లికి వందనం స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ తల్లి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండాలి.
(4 / 8)
దరఖాస్తు కోసం నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ అవసరమవుతుంది. ఇంకా ఏమైనా పత్రాలు అవసరమైతే… ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రకటనలో తెలుసుకోవచ్చు.
(5 / 8)
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు… రాష్ట్ర నివాసి అయి. ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులవుతారు.కనీసం 75 శాతం హాజరు కలిగి ఉంటేనే డబ్బులు జమవుతాయి. .తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
(6 / 8)
లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.జూన్ 5లోపే పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
(7 / 8)
ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమవుతాయి. అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింకింగ్ చేసుకోవాలి. ఇందుకు జూన్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
(8 / 8)
ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
ఇతర గ్యాలరీలు