(1 / 7)
హిందూమతంలో శంఖాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో శంఖం ధ్వనిని కూడా ఆధ్మాత్మికంగా భావిస్తారు. ఇంటిలోని పూజామందిరంలో శంఖం ఉంచడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుందని విశ్వసిస్తారు. ఇంట్లో శంఖం ఉంచడం వల్ల ఇంకేం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి.
(Pixabay)(2 / 7)
వాస్తు ప్రకారం.. ఇళ్లలో వాస్తు దోషాలను తొలగించడానికి శంఖం ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో క్రమం తప్పకుండా శంఖాన్ని ఊదుతూ ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు.
(Pixabay )(3 / 7)
వాస్తు ప్రకారం శంఖాన్ని ఇంటి పూజ ప్రదేశంలో ఉంచడం వల్ల సంతోషం, శ్రేయస్సు, సంపద, ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. శంఖం ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు.
(Pixabay)(4 / 7)
సంపదకు, శ్రేయస్సుకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శంఖం ఉన్న ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు. ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.
(Pixabay)(5 / 7)
ఇంట్లోని ప్రతి భాగానికి శంఖం నీటిని పిచికారీ చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం.. ఇంట్లో శంఖం పెట్టుకుంటే కుటుంబ కలహాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శంఖం ఉంటే సరస్వతీ దేవి అనుగ్రహంతో జ్ఞానం లభిస్తుందట.
(Pixabay)(6 / 7)
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిలో శంఖం ఉంచడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందట. మనస్సుకు ప్రశాంతత లభించి, ఒత్తిడి తగ్గుతుందట. వాస్తు ప్రకారం నియంత్రిత శ్వాసతో ఊరేగినప్పుడు శంఖం ‘ఓం’ అనే ధ్వనిని ప్రతిధ్వనిస్తుంది. ఇది మనస్సును శాంతపరుస్తుంది.
(Pixabay)ఇతర గ్యాలరీలు