AP Telangana Weather : ద్రోణి ఎఫెక్ట్..! ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు-weather updates of andhrapradesh and telangana on 6th january 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Telangana Weather : ద్రోణి ఎఫెక్ట్..! ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు

AP Telangana Weather : ద్రోణి ఎఫెక్ట్..! ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు

Published Jan 06, 2024 09:04 AM IST Maheshwaram Mahendra Chary
Published Jan 06, 2024 09:04 AM IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నాలుగైదు రోజులుగా పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

(1 / 5)

తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ, రేపు  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

(2 / 5)

ఇవాళ, రేపు  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఇదే సమయంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

(3 / 5)

ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఇదే సమయంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి మరియు దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ వివరించింది.

(4 / 5)

సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి మరియు దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ వివరించింది.

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములతో కూడి జల్లులు పడుతాయని అంచనా వేసింది.

(5 / 5)

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములతో కూడి జల్లులు పడుతాయని అంచనా వేసింది.

ఇతర గ్యాలరీలు