(1 / 6)
వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎస్) 2024 టోర్నీలో ఇండియా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ మధ్య నేడు (జూలై 12) సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్.. ఆసీస్ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. ఈ సెమీస్ పోరు ఎక్కడ చూడొచ్చో.. ఎప్పుడు మొదలవుతుందో ఇక్కడ చూడండి.
(2 / 6)
ఇండియా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ మధ్య సెమీస్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం నేడు (జూలై 12) రాత్రి 9 గంటలకు మొదలుకానుంది. అరగంట ముందు టాస్ పడుతుంది.
(3 / 6)
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ సెమీస్ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెళ్లలో లైవ్ వస్తుంది.
(4 / 6)
డిజిటల్ విషయానికి వస్తే.. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ సెమీస్ పోరును ఫ్యాన్ కోడ్ ఓటీటీ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. మ్యాచ్ పాస్ కొనుగోలు ఫ్యాన్ కోడ్లో ఈ మ్యాచ్ను చూడొచ్చు.
(5 / 6)
భారత ఛాంపియన్స్ పూర్తి జట్టు: యువరాజ్ సింగ్ (కెప్టెన్), హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్, గుర్కీరత్ మన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగీ.
(6 / 6)
డబ్ల్యూసీఎల్ 2024 టోర్నీలో తొలి సెమీస్ పాకిస్థాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేటి (జూలై 12) సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది.
ఇతర గ్యాలరీలు