(1 / 8)
ప్రయాణికులకు సరికొత్త అనుభూతితో పాటు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.
(2 / 8)
ఈ స్కీమ్ లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా… పనులను చేపట్టింది. ఇందుకు సంబంధించిన తాజా ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
(3 / 8)
వరంగల్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కోసం రైల్వే శాఖ రూ. 25.41 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మేజర్ పనులన్నీ పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు పురోగతిలో ఉన్నాయి.
(4 / 8)
రైల్వే స్టేషన్ ముఖ ద్వారాన్ని పునరుద్ధరించారు. స్టేషన్ మందు భాగంలో కాకతీయ కళాతోరణం ఉంటుంది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిసే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
(5 / 8)
వెయిటింగ్ హాల్ పనులు పూర్తయ్యాయి. కొత్త ఫర్నిచర్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు కూడా చర్యలు చేపట్టారు.
(6 / 8)
పునరుద్ధరణ పనుల్లో భాగంగా… టికెట్ కౌంటర్లతో పాటు యంత్రాలను కూడా సిద్ధం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
(7 / 8)
ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఆధునాతమైన ఎస్కులేటర్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, పైకప్పు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్, పార్కింగ్, పచ్చదనం తదితర పనులు చేపట్టారు.
ఇతర గ్యాలరీలు