Train Accident విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం-ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు!-vizianagaram fatal train accident two passenger trains collided six died ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Train Accident విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం-ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు!

Train Accident విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం-ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు!

Published Oct 29, 2023 10:23 PM IST Bandaru Satyaprasad
Published Oct 29, 2023 10:23 PM IST

  • Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగిఉన్న ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు.

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 

(1 / 8)

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 

రైలు ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లలో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. 

(2 / 8)

రైలు ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లలో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. 

ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై నిలిచింది. ఆ సమయంలో వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. 

(3 / 8)

ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై నిలిచింది. ఆ సమయంలో వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో మూడు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంగా మారింది. 

(4 / 8)

ఈ ప్రమాదంలో మూడు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంగా మారింది. 

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

(5 / 8)

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో రైల్వే, స్థానిక అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం..  0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.  

(6 / 8)

రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో రైల్వే, స్థానిక అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం..  0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.  

ప్యాసింజర్‌ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. కోల్‌కతా-చెన్నై ప్రధాన మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో భువనేశ్వర్‌ వద్ద కొన్ని రైళ్లను నిలిపివేయగా, కోల్‌కతా వైపు రైళ్లను విశాఖ సహా తదితర స్టేషన్లలో నిలిపివేశారు.   

(7 / 8)

ప్యాసింజర్‌ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. కోల్‌కతా-చెన్నై ప్రధాన మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో భువనేశ్వర్‌ వద్ద కొన్ని రైళ్లను నిలిపివేయగా, కోల్‌కతా వైపు రైళ్లను విశాఖ సహా తదితర స్టేషన్లలో నిలిపివేశారు.   

విజయనగరంలో రైలు ప్రమాదం

(8 / 8)

విజయనగరంలో రైలు ప్రమాదం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు