Virat Kohli: కెప్టెన్సీ ఇస్తామంటే వద్దన్న విరాట్ కోహ్లీ! వివరాలివే-virat kohli declines delhi captaincy in ranji trophy match ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Kohli: కెప్టెన్సీ ఇస్తామంటే వద్దన్న విరాట్ కోహ్లీ! వివరాలివే

Virat Kohli: కెప్టెన్సీ ఇస్తామంటే వద్దన్న విరాట్ కోహ్లీ! వివరాలివే

Jan 28, 2025, 01:38 PM IST Chatakonda Krishna Prakash
Jan 28, 2025, 01:38 PM , IST

  • Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుమారు 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆ వివరాలు ఇవే..

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లుగా టెస్టుల్లో సరైన ఫామ్‍లో లేడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో గత రెండు టెస్టు సిరీస్‍‍ల్లో తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ తరుణంలో దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యాడు. సుమారు 13ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‍లో బరిలోకి దిగనున్నాడు. 

(1 / 5)

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లుగా టెస్టుల్లో సరైన ఫామ్‍లో లేడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో గత రెండు టెస్టు సిరీస్‍‍ల్లో తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ తరుణంలో దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యాడు. సుమారు 13ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‍లో బరిలోకి దిగనున్నాడు. 

(PTI)

రంజీ ట్రోఫీలో తన ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. రైల్వేస్‍తో జనవరి 30న మొదలుకానున్న చివరి గ్రూప్ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఇందుకోసం ఢిల్లీ జట్టుతో కోహ్లీ కలిశాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు.  

(2 / 5)

రంజీ ట్రోఫీలో తన ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. రైల్వేస్‍తో జనవరి 30న మొదలుకానున్న చివరి గ్రూప్ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఇందుకోసం ఢిల్లీ జట్టుతో కోహ్లీ కలిశాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు.  

(PTI)

విరాట్ కోహ్లీ రావడంతో అతడికి గౌరవంగా కెప్టెన్సీ ఇచ్చేందుకు ఢిల్లీ మేనేజ్‍మెంట్ నిర్ణయించింది. ఈ మ్యాచ్‍లో కెప్టెన్సీ చేయాలని కోహ్లీని అడిగిందట. అయితే, కెప్టెన్సీ ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడని సమాచారం బయటికి వచ్చింది. 

(3 / 5)

విరాట్ కోహ్లీ రావడంతో అతడికి గౌరవంగా కెప్టెన్సీ ఇచ్చేందుకు ఢిల్లీ మేనేజ్‍మెంట్ నిర్ణయించింది. ఈ మ్యాచ్‍లో కెప్టెన్సీ చేయాలని కోహ్లీని అడిగిందట. అయితే, కెప్టెన్సీ ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడని సమాచారం బయటికి వచ్చింది. 

(PTI)

రైల్వేస్‍తో మ్యాచ్‍‍లో తాను ఢిల్లీకి సారథ్యం వహించనని, ఆటగాడిగానే బరిలోకి దిగుతానని కోహ్లీ అన్నాడట. ఆయుష్ బదోనీ సారథ్యంలో ఈ మ్యాచ్‍ను కోహ్లీ ఆడనున్నాడు.

(4 / 5)

రైల్వేస్‍తో మ్యాచ్‍‍లో తాను ఢిల్లీకి సారథ్యం వహించనని, ఆటగాడిగానే బరిలోకి దిగుతానని కోహ్లీ అన్నాడట. ఆయుష్ బదోనీ సారథ్యంలో ఈ మ్యాచ్‍ను కోహ్లీ ఆడనున్నాడు.

(PTI)

జనవరి 30వ తేదీన ఢిల్లీ, రైల్వేస్ మధ్య మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున కోహ్లీతో పాటు పంత్ కూడా ఆడనున్నాడు. 2012 తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో ఇప్పుడు బరిలోకి దిగనున్నాడు విరాట్. 

(5 / 5)

జనవరి 30వ తేదీన ఢిల్లీ, రైల్వేస్ మధ్య మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున కోహ్లీతో పాటు పంత్ కూడా ఆడనున్నాడు. 2012 తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో ఇప్పుడు బరిలోకి దిగనున్నాడు విరాట్. 

(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు