ఐపీఎల్ ఫైన‌ల్‌.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా యూకే మాజీ ప్ర‌ధాని.. భార్య‌తో రిషి సునాక్ సంద‌డి.. స‌పోర్ట్ ఏ టీమ్‌కు అంటే?-uk ex prime minister rishi sunak with wife in ahmedabad for ipl 2025 final to support rcb against punjab kings photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐపీఎల్ ఫైన‌ల్‌.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా యూకే మాజీ ప్ర‌ధాని.. భార్య‌తో రిషి సునాక్ సంద‌డి.. స‌పోర్ట్ ఏ టీమ్‌కు అంటే?

ఐపీఎల్ ఫైన‌ల్‌.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా యూకే మాజీ ప్ర‌ధాని.. భార్య‌తో రిషి సునాక్ సంద‌డి.. స‌పోర్ట్ ఏ టీమ్‌కు అంటే?

Published Jun 03, 2025 10:33 PM IST Chandu Shanigarapu
Published Jun 03, 2025 10:33 PM IST

ఐపీఎల్ 2025 ఫైనల్లో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భార్య అక్షత మూర్తితో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. అహ్మదాబాద్ లో ఆయన ఏ టీమ్ కు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోండి మరి.

ఐపీఎల్ 2025 ఫైనల్ కు యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భార్య అక్షత మూర్తితో కలిసి ఆయన ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.

(1 / 5)

ఐపీఎల్ 2025 ఫైనల్ కు యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భార్య అక్షత మూర్తితో కలిసి ఆయన ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.

(PTI)

అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు సతీసమేతంగా వచ్చిన రిషి సునాక్ స్టేడియంలోని ఫ్యాన్స్ ను పలకరించారు. భార్యతో కలిసి గ్రౌండ్ నుంచి చేతులు ఊపుతూ హాయ్ చెప్పారు.

(2 / 5)

అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు సతీసమేతంగా వచ్చిన రిషి సునాక్ స్టేడియంలోని ఫ్యాన్స్ ను పలకరించారు. భార్యతో కలిసి గ్రౌండ్ నుంచి చేతులు ఊపుతూ హాయ్ చెప్పారు.

(AP)

బెంగళూరు కుటుంబానికి చెందిన అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్న రిషి సునాక్.. ఈ ఫైనల్లో ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ టీమ్ బౌండరీలు కొట్టినప్పుడల్లా, వికెట్లు తీసినప్పుడల్లా కమాన్ అంటూ చీర్ చేస్తున్నారు. ‘లెట్స్ గో ఆర్సీబీ’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రిషి సునాక్.

(3 / 5)

బెంగళూరు కుటుంబానికి చెందిన అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్న రిషి సునాక్.. ఈ ఫైనల్లో ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ టీమ్ బౌండరీలు కొట్టినప్పుడల్లా, వికెట్లు తీసినప్పుడల్లా కమాన్ అంటూ చీర్ చేస్తున్నారు. ‘లెట్స్ గో ఆర్సీబీ’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రిషి సునాక్.

(@RishiSunak)

ఐసీసీ ఛైర్మన్ జై షా ఫ్యామిలీతో కలిసి స్టాండ్స్ లో కూర్చుని రిషి సునాక్, అక్షత మూర్తి మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. అంతకుముందు స్టేడియంలో  రిషి సునాక్ దంపతులకు ఘన స్వాగతం లభించింది.

(4 / 5)

ఐసీసీ ఛైర్మన్ జై షా ఫ్యామిలీతో కలిసి స్టాండ్స్ లో కూర్చుని రిషి సునాక్, అక్షత మూర్తి మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. అంతకుముందు స్టేడియంలో రిషి సునాక్ దంపతులకు ఘన స్వాగతం లభించింది.

(PTI)

ప్రపంచ క్రికెట్ ను ఐపీఎల్ ఎంతలా మార్చిందనే విషయాన్ని జై షాతో చర్చించానని ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో రిషి సునాక్ చెప్పారు. ఒలింపిక్స్ లో క్రికెట్ రీ ఎంట్రీకి ఇండియానే కారణమని కూడా అన్నారు.

(5 / 5)

ప్రపంచ క్రికెట్ ను ఐపీఎల్ ఎంతలా మార్చిందనే విషయాన్ని జై షాతో చర్చించానని ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో రిషి సునాక్ చెప్పారు. ఒలింపిక్స్ లో క్రికెట్ రీ ఎంట్రీకి ఇండియానే కారణమని కూడా అన్నారు.

(PTI)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు