TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - గ్రామ‌ సభ‌ల్లో 2 రకాల జాబితాలు..! తాజా నిర్ణయాలివే-two important updates about the telangana indiramma housing scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - గ్రామ‌ సభ‌ల్లో 2 రకాల జాబితాలు..! తాజా నిర్ణయాలివే

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - గ్రామ‌ సభ‌ల్లో 2 రకాల జాబితాలు..! తాజా నిర్ణయాలివే

Jan 19, 2025, 07:31 AM IST Maheshwaram Mahendra Chary
Jan 19, 2025, 07:31 AM , IST

  • TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. గ్రామసభల్లో రెండు రకాల జాబితాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలెంటో ఇక్కడ చూడండి….

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.

(1 / 8)

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యాప్ సర్వేతో పాటు ఇందిరమ్మ కమిటీల సాయంతో ఈ పేర్లను ఖరారు చేయనుంది.  

(2 / 8)

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యాప్ సర్వేతో పాటు ఇందిరమ్మ కమిటీల సాయంతో ఈ పేర్లను ఖరారు చేయనుంది. 
 

 అయితే గ్రామసభల్లో రెండు రకాల జాబితాలను ప్రదర్శించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 

(3 / 8)

 అయితే గ్రామసభల్లో రెండు రకాల జాబితాలను ప్రదర్శించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 

ఇంటి స్థలం ఉన్న వారి జాబితతో పాటు ఇంటి స్థలం లేని వారి జాబితాలను కూడా గ్రామ సభల్లో ప్రదర్శించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.  ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 

(4 / 8)

ఇంటి స్థలం ఉన్న వారి జాబితతో పాటు ఇంటి స్థలం లేని వారి జాబితాలను కూడా గ్రామ సభల్లో ప్రదర్శించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.  ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 

రెండు జాబితాలతో పాటు ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది.  కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారు కూడా… అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉండనుంది.

(5 / 8)

రెండు జాబితాలతో పాటు ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది.  కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారు కూడా… అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉండనుంది.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు తెలంగా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై చర్చించనున్నారు. అర్హులైన వారి జాబితాలకు గ్రామసభలో ఆమోదం తెలుపుతారు. 

(6 / 8)

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు తెలంగా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై చర్చించనున్నారు. అర్హులైన వారి జాబితాలకు గ్రామసభలో ఆమోదం తెలుపుతారు. 

గ్రామసభల్లో ఫైనల్ చేసే జాబితాలకు జిల్లాల ఇంఛార్జీ మంత్రులు ఆమోదం తెలుపుతారు. ఈ లిస్టులు కలెక్టర్ల వద్దకు చేరుతాయి. జిల్లా కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జాబితాలు విడుదలవుతాయి.వీరే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అవుతారు.

(7 / 8)

గ్రామసభల్లో ఫైనల్ చేసే జాబితాలకు జిల్లాల ఇంఛార్జీ మంత్రులు ఆమోదం తెలుపుతారు. ఈ లిస్టులు కలెక్టర్ల వద్దకు చేరుతాయి. జిల్లా కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జాబితాలు విడుదలవుతాయి.వీరే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అవుతారు.

తొలి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.  ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్(. https://indirammaindlu.telangana.gov.in ) కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 

(8 / 8)

తొలి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.  ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్(. https://indirammaindlu.telangana.gov.in ) కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు