తక్కువ ఫీజులు ఉన్న టాప్ 5 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు-top 5 low fee government engineering colleges for jee aspirants admission 2025 check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తక్కువ ఫీజులు ఉన్న టాప్ 5 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు

తక్కువ ఫీజులు ఉన్న టాప్ 5 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు

Published Jul 06, 2025 07:59 PM IST Anand Sai
Published Jul 06, 2025 07:59 PM IST

ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు తక్కువ ఫీజుతో అత్యుత్తమ చదువులు చదివే టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆ కాలేజీల గురించి తెలుసుకుందాం.

జేఈఈ స్కోర్ ఆశించినంతగా రాకపోతే ఐఐటీ, ఎన్ఐటీలో సీటు రాకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా.. చాలా చౌకగా అందించే కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ప్రాయోజిత ఇంజనీరింగ్ కళాశాలలు దేశంలో ఉన్నాయి.

(1 / 6)

జేఈఈ స్కోర్ ఆశించినంతగా రాకపోతే ఐఐటీ, ఎన్ఐటీలో సీటు రాకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా.. చాలా చౌకగా అందించే కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ప్రాయోజిత ఇంజనీరింగ్ కళాశాలలు దేశంలో ఉన్నాయి.

జకీర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అలీగఢ్. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో భాగమైన జాకీర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థ మాత్రమే కాదు, చాలా తక్కువ మొత్తం ఫీజు 33,870 రూపాయలతో అద్భుతమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది. 1935లో స్థాపించిన ఈ కళాశాల సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్, కెమికల్, పెట్రోలియం, ఆర్కిటెక్చర్ కోర్సులలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వరకు కోర్సులను అందిస్తుంది.

(2 / 6)

జకీర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అలీగఢ్. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో భాగమైన జాకీర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థ మాత్రమే కాదు, చాలా తక్కువ మొత్తం ఫీజు 33,870 రూపాయలతో అద్భుతమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది. 1935లో స్థాపించిన ఈ కళాశాల సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్, కెమికల్, పెట్రోలియం, ఆర్కిటెక్చర్ కోర్సులలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వరకు కోర్సులను అందిస్తుంది.

సీఓఈపీ టెక్నలాజికల్ యూనివర్శిటీ, పూణే - మహారాష్ట్ర ప్రభుత్వంతో నిర్వహిస్తున్న ఈ విశ్వవిద్యాలయం 1854లో స్థాపించిన భారతదేశంలో మూడో పురాతన ఇంజనీరింగ్ సంస్థ. ఎన్ఐఆర్ఎఫ్ 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఈ సంస్థ 73వ ర్యాంకు సాధించింది. ఇక్కడ మొత్తం ఫీజు రూ.1,80,750.  సీఓఈపీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో అద్భుతమైన ఫ్యాకల్టీ, అత్యాధునిక ల్యాబ్ లు, పరిశ్రమ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

(3 / 6)

సీఓఈపీ టెక్నలాజికల్ యూనివర్శిటీ, పూణే - మహారాష్ట్ర ప్రభుత్వంతో నిర్వహిస్తున్న ఈ విశ్వవిద్యాలయం 1854లో స్థాపించిన భారతదేశంలో మూడో పురాతన ఇంజనీరింగ్ సంస్థ. ఎన్ఐఆర్ఎఫ్ 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఈ సంస్థ 73వ ర్యాంకు సాధించింది. ఇక్కడ మొత్తం ఫీజు రూ.1,80,750. సీఓఈపీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో అద్భుతమైన ఫ్యాకల్టీ, అత్యాధునిక ల్యాబ్ లు, పరిశ్రమ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గవర్నమెంట్ మోడల్ ఇంజనీరింగ్ కాలేజ్, కొచ్చి. కేరళలోని త్రిక్కకరలో ఉన్న ఎంఈసీ ఒక ప్రభుత్వ కాస్ట్ షేరింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఇది ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. 1989లో ఏర్పాటైన ఈ సంస్థ సాంకేతిక విద్యారంగంలో విశ్వసనీయమైన పేరుగా మారింది. మొత్తం రూ.2,15,000 ఫీజుతో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య, పరిశోధనలను అందిస్తోంది.

(4 / 6)

గవర్నమెంట్ మోడల్ ఇంజనీరింగ్ కాలేజ్, కొచ్చి. కేరళలోని త్రిక్కకరలో ఉన్న ఎంఈసీ ఒక ప్రభుత్వ కాస్ట్ షేరింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఇది ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. 1989లో ఏర్పాటైన ఈ సంస్థ సాంకేతిక విద్యారంగంలో విశ్వసనీయమైన పేరుగా మారింది. మొత్తం రూ.2,15,000 ఫీజుతో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య, పరిశోధనలను అందిస్తోంది.

ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, కన్నౌజ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ఈ ప్రభుత్వ కళాశాల ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్ సంస్థల వరుసలో ఉంది. కళాశాల మొత్తం ఫీజు రూ.2,22,000. ఇక్కడ ప్రవేశం జేఈఈ మెయిన్స్ స్కోరు ఆధారంగా ఉంటుంది. చిన్న పట్టణంలో ఉన్నప్పటికీ, ఈ సంస్థ ఆధునిక సౌకర్యాలు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని పొందుతుంది. ఇది విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి సహాయపడుతుంది.

(5 / 6)

ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, కన్నౌజ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ఈ ప్రభుత్వ కళాశాల ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్ సంస్థల వరుసలో ఉంది. కళాశాల మొత్తం ఫీజు రూ.2,22,000. ఇక్కడ ప్రవేశం జేఈఈ మెయిన్స్ స్కోరు ఆధారంగా ఉంటుంది. చిన్న పట్టణంలో ఉన్నప్పటికీ, ఈ సంస్థ ఆధునిక సౌకర్యాలు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని పొందుతుంది. ఇది విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి సహాయపడుతుంది.

మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్‌ఖండ్ యూనివర్సిటీ, బరేలీ. తక్కువ బడ్జెట్‌లో సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగం ఆప్షన్. ఇక్కడ మొత్తం డిగ్రీ ఫీజు రూ.3,00,600. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వాతావరణం విద్యార్థులు చదవడానికి ప్రేరేపిస్తుంది.

(6 / 6)

మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్‌ఖండ్ యూనివర్సిటీ, బరేలీ. తక్కువ బడ్జెట్‌లో సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగం ఆప్షన్. ఇక్కడ మొత్తం డిగ్రీ ఫీజు రూ.3,00,600. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వాతావరణం విద్యార్థులు చదవడానికి ప్రేరేపిస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు