(1 / 5)
గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు నేడు (మే 7) నక్షత్రం మారాడు. అశ్వినీ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. మే 15వ తేదీ వరకు అంటే దాదాపు మరో వారం అశ్వినీ నక్షత్రంలో బుధుడు సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఎక్కువగా అదృష్టం కలుగుతుంది. అవేవంటే..
(2 / 5)
మేషం: అశ్వినీ నక్షత్రంలో బుధుడు సంచరించే కాలం మేషరాశి వారికి కలిసి వస్తుంది. అనేక లాభాలు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి రాబడులు బాగా ఉంటాయి. కొత్త పనులు చేసేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
(3 / 5)
కుంభం: అశ్వినీలో బుధుడి సంచారం కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. సానుకూలంగా ఆలోచిస్తారు. సవాళ్లను సులువుగా దాటేస్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు డబ్బు విషయాల్లో లాభిస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
(4 / 5)
సింహం: అశ్వినీలో బుధుడు ఉండే కాలంలో సింహ రాశి వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. చాలా పనుల్లో సక్సెస్ చూస్తారు. మనశ్శాంతి ఉంటుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు. స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు.
(5 / 5)
తుల: అశ్వినీ నక్షత్రంలో బుధుడు సంచరించే కాలం తులా రాశి వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కారం కావొచ్చు. ఉత్సాహంగా పనులు చేస్తారు. కార్యాలయాల్లో ఉద్యోగులకు సహచరుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తీరే ఛాన్స్ ఉంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు