(1 / 5)
జ్యోతిషం ప్రకారం, ఒక రాశిలో గ్రహాల కలయిక జరిగినప్పుడు రాశులపై ప్రభావం పడుతుంది. అదృష్టం మారుతుంటుంది. తాజాగా మేషరాశిలో సూర్యుడు, చంద్రుడి కలయిక జరిగింది.
(Canva)(2 / 5)
ప్రస్తుతం మేషరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. అయితే, నేడు (ఏప్రిల్ 27) మేషరాశిలోకి చంద్రుడు కూడా ప్రవేశించాడు. దీంతో మేషరాశిలో సూర్యుడు, చంద్రుడి కలయిక జరిగింది. ఇది మూడు రాశుల వారికి ప్రయోజనకంగా ఉంది. మేషంలో చంద్రుడు ఉండే ఏప్రిల్ 29వ తేదీ తెల్లవారుజాము వరకు ఈ ప్రభావం ఉంటుంది.
(3 / 5)
సింహం: మేశరాశిలో సూర్య, చంద్రుల కలయిక వల్ల సింహ రాశి వారికి మంచి సమయం మొదలైంది. ఈ కాలంలో వీరికి అదృష్టం మెండుగా ఉంటుంది. వారి రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారాలకు ధన ప్రయోజనాలు ఉంటాయి. సహచరనుల నుంచి సపోర్ట్ ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
(4 / 5)
కుంభం: సూర్యడు, చంద్రుడి కలయిక కాలంలో కుంభ రాశి వారికి మేలు జరుగుతుంది. చేసే పనుల్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం బాగా లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. పనిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.
(5 / 5)
మేషం: ఈ రాశిలోనే సూర్యుడు, చంద్రుడు కలిశారు. దీంతో మేషరాశి వారికి కూడా లాభిస్తుంది. చాలా విషయాల్లో పాజిటివ్గా ఆలోచిస్తారు. లక్ ఎక్కువగా కలిసి వస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల అనుసారం ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు