(1 / 5)
ధృక్ పంచాగం ప్రకారం, మే 15వ తేదీన మేషరాశిలో బుధుడు అస్తమిస్తాడు. మళ్లీ జూన్ 8న ఉదయిస్తాడు. బుధుడు అస్తమయంలో ఉండే 25 రోజుల కాలంలో నాలుగు రాశుల వారికి కాలం కలిసిరానుంది. ప్రయోజనాలు ఉంటాయి. ఆ రాశులు ఏవంటే..
(2 / 5)
మిథునం: బుధుడి అస్తమయం.. మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం బాగుంటుంది. దీంతో కెరీర్ గురించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. డబ్బు విషయాల్లో బాగా కలిసి వస్తుంది. అదృష్టం వల్ల కొన్ని పనులు సునాయాసంగానే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి.
(3 / 5)
తుల: బుధుడిలోని ఈ మార్పు తులా రాశి వారికి ప్రయోజనకరం. ఈ కాలంలో వీరికి సక్సెస్ బాగుంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, రివార్డులు దక్కుతాయి. లక్ బాగా సపోర్ట్ చేస్తుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు వ్యాపారులకు, ఉద్యోగులకు ఉంటాయి. స్నేహితులు కొన్ని విషయాల్లో అండగా ఉంటారు.
(4 / 5)
సింహం: బుధుడి అస్తమయం వల్ల సింహ రాశి వారికి శుభాలు కలుగుతాయి. వీరికి ఈ కాలంలో కొత్త ఆలోచనలు వస్తాయి. కెరీర్లో ఎదగడం గురించి ఫోకస్ చేస్తారు. కొందరికి ధనం ఆకస్మికంగా సిద్ధిస్తుంది. ఉద్యోగులకు సహచరుల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు దక్కొచ్చు. ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది.
(5 / 5)
వృషభం: బుధుడి అస్తమయంతో వృషభ రాశి వారి దశ తిరుగుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ధనం విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. చాలా విషయాల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. దీంతో కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు