(1 / 5)
ధృక్ పంచాంగం ప్రకారం, మే 14వ తేదీన గురువు (బృహస్పతి).. మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. జూన్ 15న సూర్యుడు.. మిథునంలోకి అడుగుపెడతాడు. దీంతో జూన్ 15న మిథునంలో గురువు, సూర్యుడు కలవనున్నారు. ఈ కలయిక నాలుగు రాశుల వారికి చాలా లాభిస్తుంది. మిథునంలో సూర్యుడు ఉండే జూలై 16 వరకు ఈ కలయిక ప్రభావం ఉంటుంది.
(2 / 5)
మీనం: మిథునంలో గురువు, సూర్యుడు కలిసి సంచరించే కాలంలో మీనరాశి వారికి అదృష్టం ఎక్కువ. పాజిటివ్గా ఆలోచిస్తారు. అనుకున్న పనులు చాలా విజయవంతం అవుతాయి. ఆర్థిక విషయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి. వ్యాపారాలకు లాభాలు అధికం అవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం మేలు చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
(3 / 5)
వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారికి లక్ ఎక్కువగా కలిసి వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తారు. ఇల్లు కొనాలని ఆలోచిస్తున్న వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ఆరంభించేందుకు సానుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
(4 / 5)
సింహం: మిథునంలో గురువు, సూర్యుడి కలయిక ఉండే కాలం సింహ రాశి వారికి శుభప్రదం. వీరికి మానసిక ఆనందం బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోవచ్చు. వ్యాపారులకు కొత్త డీల్స్ జరగొచ్చు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
(5 / 5)
కన్య: మిథున రాశిలో గురువు, సూర్యుడి కలయిక వల్ల కన్య రాశి దశ మారుతుంది. వీరికి చాలా విషయాల్లో అదృష్టం వెన్నంటి ఉంటుంది. దీంతో వీరు అనుకునే పనులు ఎక్కువ శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. చాలా కాలం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు కావొచ్చు. డబ్బు విషయం నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. (గమనిక: నమ్మాకాలు, శాస్త్రాల అనుసారం ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలను తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు