(1 / 6)
డిఎస్సీ 2025 ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి మాక్ టెస్ట్లు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు ఇచ్చారు. డిఎస్సీ 2024లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయొచ్చు. ఇతర పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
(2 / 6)
డిఎస్సీ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితిని జులై ఒకటో తేదీ నాటికి 44ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్ధులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రత్యేక విద్య బీఈడీ కలిగిన అభ్యర్ధులు సాధారణ పాఠశాలలోని పోస్టులకు అర్హత కలిగి, పోస్టుకు ఎంపికైతే వారికి ఆరు నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేస్తారు.స్పోర్ట్స్ కోటా అభ్యర్తులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు.
(3 / 6)
ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ విద్య టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉండదు. వంద మార్కులకు రెండు వందల ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపాల్స్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యు యేట్ టీచర్స్(టీజీటీ) నాన్ లాంగ్వేజెస్ వారికి పేపర్-1లో ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకడమిక్స్, ఆంగ్ల భాష నైపుణ్యంపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు.
(4 / 6)
ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది.దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా విధానాలను తీసుకొచ్చింది.అభ్యర్థులు పోస్టులకు ఐచ్చికాలను ముందే నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు.నియామక ప్రక్రియలో జాప్యం లేకుండా ఉండేందుకు ముందే సమర్పించేలా మార్పు చేశారు. డాక్యుమెంట్స్ సమర్పించని అభ్యర్థులకు హాల్ టిక్కెట్స్ జారీ చేయరు. దరఖాస్తులో సవరణలకు అనుమతించరు.
(5 / 6)
గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్ధులకు తీసుకొ చ్చిన అప్రెంటిస్ షిప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ-2024లో అప్రెంటిస్ప్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనిని తాజాగా రద్దు చేశారు.
(6 / 6)
కంప్యూటర్ బేస్డ్ విధానంలో డిఎస్సీ 2025 పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరుగుతాయి.దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్ష తేదీలను ఖరారు చేస్తారు. పరీక్షా కేంద్రాలను మొదట దరఖాస్తు చేసిన వారికి మొదట ప్రాతిపదికన కేటాయిస్తారు.
ఇతర గ్యాలరీలు