(1 / 6)
పౌర్ణమి సందర్భంగా చాలా మంది భక్తులు తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తున్నారు. అలాంటి వారికోసం పలు ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి
(2 / 6)
జనగామ - అరుణాచలం : తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రం నుంచి అరుణాచలానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడపనుంది. వీకెండ్స్ లో ఈ జర్నీ ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం, శ్రీపురం, కాణిపాకం చూడొచ్చు. పెద్దలకు రూ. 4500, చిన్నారులకు 2500గా ధర నిర్ణయించారు. https://www.tgsrtc.telangana.gov.in/ లో వివరాలు చూడొచ్చు. బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు.
(3 / 6)
జగిత్యాల నుంచి కూడా మరో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా కాణిపాకం, వెల్లూరు, అరుణాచలం, జోగులాంబ ఆలయాలను దర్శించుకోవచ్చు. జూలై 8వ తేదీన జర్నీ ఉంటుంది. జూలై 10వ తేదీన అరుణాచలంలో గిరి ప్రదక్షణ(గురు పౌర్ణమి) చేయవచ్చు.
(4 / 6)
తొర్రూరు డిపో నుంచి కూడా అరుణాచలం వెళ్లొచ్చు. ఈ ట్రిప్ కూడా వీకెండ్ లో ఉంటుంది. ఇందులో భాగంగా బీచపల్లి, గద్వాల, అరుణాచలం, శ్రీపురం, కాణిపాకం చూడొచ్చు. https://www.tgsrtcbus.in/ వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫొటోలో సూచించిన ఫోన్ నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(5 / 6)
ఈ ప్యాకేజీల్లో భాగంగా షరతులు వర్తిస్తాయని టీజీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అధికారులు సూచించిన ఫోన్ నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.ఆపై బుకింగ్ చేసుకోవచ్చు.
(6 / 6)
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. అలాంటి వారికోసం పలు ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ కూడా పలు ప్రాంతాల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తోంది.
ఇతర గ్యాలరీలు