టీజీ లాసెట్ - 2025కు అప్లయ్ చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ఫైన్ తో ఎప్పటివరకంటే...-tg lawcet 2025 application window closes today without late fee ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టీజీ లాసెట్ - 2025కు అప్లయ్ చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ఫైన్ తో ఎప్పటివరకంటే...

టీజీ లాసెట్ - 2025కు అప్లయ్ చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ఫైన్ తో ఎప్పటివరకంటే...

Published Apr 30, 2025 08:43 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 30, 2025 08:43 AM IST

తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఇవాళ్టితో(ఏప్రిల్ 30) తేదీతో గడువు ముగియనుంది. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి పెంచే అవకాశం లేదు. రూ. 500 ఫైన్ తో మే 10 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 30వ తేదీతో పూర్తి అయింది. వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

(1 / 7)

తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 30వ తేదీతో పూర్తి అయింది. వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

(istock.com)

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…ఫైన్ లేకుండా ఏప్రిల్ 15వ తేదీతోనే పూర్తయింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ గడువు ఇవాళ్టితో ముగుస్తుంది.

(2 / 7)

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…ఫైన్ లేకుండా ఏప్రిల్ 15వ తేదీతోనే పూర్తయింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ గడువు ఇవాళ్టితో ముగుస్తుంది.

(istock.com)

రూ. 500 ఫైన్ తో మే 10 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 1000తో అయితే మే 15 వరకు అవకాశం ఉంది. రూ. 2000 ఫైన్ తో మే 20 వరకు, రూ. 4 వేల ఫైన్ తో మే 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

(3 / 7)

రూ. 500 ఫైన్ తో మే 10 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 1000తో అయితే మే 15 వరకు అవకాశం ఉంది. రూ. 2000 ఫైన్ తో మే 20 వరకు, రూ. 4 వేల ఫైన్ తో మే 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

టీజీ లాసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి.  పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ఏప్రిల్ 30లోపు అయితేనే ఈ ఫీజులు వర్తిస్తాయి. గడువు దాటితే వీటికితోడు ఆలస్య రుసుం చెల్లించాలి.

(4 / 7)

టీజీ లాసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ఏప్రిల్ 30లోపు అయితేనే ఈ ఫీజులు వర్తిస్తాయి. గడువు దాటితే వీటికితోడు ఆలస్య రుసుం చెల్లించాలి.

ఇక ఆన్ లైన్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 25 వరకు అవకాశం ఉంటుంది. ఇక మే 30వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. జూన్ 6వ తేదీన టీజీ లాసెట్ - 2025 ఎగ్జామ్ ఉంటుంది.

(5 / 7)

ఇక ఆన్ లైన్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 25 వరకు అవకాశం ఉంటుంది. ఇక మే 30వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. జూన్ 6వ తేదీన టీజీ లాసెట్ - 2025 ఎగ్జామ్ ఉంటుంది.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.

(6 / 7)

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.

టీజీ లాసెట్ 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://lawcet.tgche.ac.in/HOMEPAGE.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అప్లికేషన్, హాల్ టికెట్లు, ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.

(7 / 7)

టీజీ లాసెట్ 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://lawcet.tgche.ac.in/HOMEPAGE.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అప్లికేషన్, హాల్ టికెట్లు, ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు