(1 / 6)
తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ ఇండ్లు నిర్మించాలని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం 'ఇందిరమ్మ ఇండ్లు'. ఈ ఇళ్ల కోసం 'ప్రజాపాలన'లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది ప్రభుత్వం.
(2 / 6)
ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 36.03 లక్షలు అంటే సుమారు 46.7 శాతం మంది అర్హులని అధికారులు గుర్తించారు. మిగతా 41.15 లక్షల అంటే 53.3 శాతం మందిని అనర్హులుగా తేల్చారు. వీరంతా దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారేనని గుర్తించారు.
(3 / 6)
అర్హులు, అనర్హుల వివరాలతో తెలంగాణ గృహ నిర్మాణశాఖ ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలుగా సిద్ధం చేసింది. వీటి ప్రకారం ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3,500 చొప్పున...ఏడాదిలో మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
(4 / 6)
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్-1, ఎల్-2, ఎల్-3లుగా విభజించారు. ఎల్-1లో 23.05 లక్షలు, ఎల్-2లో 21.44 లక్షలు, ఎల్-3లో 32.69 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్లు గుర్తించారు.
(5 / 6)
ఎల్-1 జాబితాలో సొంత భూమి ఉండి ఇల్లు లేని వారు, సొంత స్థలంలో పూరిళ్లు, మట్టిమిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని చేర్చారు. ఎల్-2 లిస్ట్ లో స్థలాలు, ఇల్లు లేని వారిని చేర్చారు. ఎల్-3 లిస్ట్ లో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇళ్లు, కార్లు ఉన్నవారు, బీపీఎల్ కు ఎగువన ఉన్నవారు, ఆదాయపుపన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు.
(6 / 6)
గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీల వారీగా ఈ జాబితాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరిలోనే జాబితాలు సిద్ధం చేయగా, మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లిస్ట్ లు రూపొందించారు. దీంతో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధనల ప్రకారం ఎల్-3 ఉన్న వారంతా అనర్హులే అని తెలుస్తోంది. ఎల్-1 లిస్ట్ లో 18.67 లక్షల మంది, ఎల్-2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా తేల్చారు.
ఇతర గ్యాలరీలు