'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు, ఇదే లాస్ట్ ఛాన్స్...!-tg dost 2025 admission updates 3rd phase registrations closed on june 25 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు, ఇదే లాస్ట్ ఛాన్స్...!

'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు, ఇదే లాస్ట్ ఛాన్స్...!

Published Jun 24, 2025 10:43 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 24, 2025 10:43 AM IST

తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దోస్త్ 2 విడతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూన్ 25వ తేదీతో ముగియనుంది. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు దగ్గరపడింది.

(1 / 7)

దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు దగ్గరపడింది.

 జూన్ 25(బుధవారం) తేదీతో దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు ముగుస్తుంది అయితే.మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

(2 / 7)

జూన్ 25(బుధవారం) తేదీతో దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు ముగుస్తుంది అయితే.మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జూన్ 25లోపు  రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. ఇందుకు కూడా జూన్ 25వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 28వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.

(3 / 7)

జూన్ 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. ఇందుకు కూడా జూన్ 25వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 28వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.

(HT Telugu )

జూన్ 28 నుంచి 30 తేదీల మధ్య ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

(4 / 7)

జూన్ 28 నుంచి 30 తేదీల మధ్య ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కాలేజీల్లో ఓరియేంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి.

(5 / 7)

జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కాలేజీల్లో ఓరియేంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి.

 సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. కాబట్టి దోస్త్ ద్వారా సీటు పొందే విద్యార్థులు... తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.,

(6 / 7)

సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. కాబట్టి దోస్త్ ద్వారా సీటు పొందే విద్యార్థులు... తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.,

(pixabay)

దోస్త్ మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in/ లింక్ తో రిజిస్ట్రేషన్ తో పాటు ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

(7 / 7)

దోస్త్ మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in/ లింక్ తో రిజిస్ట్రేషన్ తో పాటు ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

(pixabay)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు