(1 / 7)
దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు దగ్గరపడింది.
(2 / 7)
జూన్ 25(బుధవారం) తేదీతో దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు ముగుస్తుంది అయితే.మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
(3 / 7)
జూన్ 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. ఇందుకు కూడా జూన్ 25వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 28వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.
(HT Telugu )(4 / 7)
జూన్ 28 నుంచి 30 తేదీల మధ్య ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
(5 / 7)
జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కాలేజీల్లో ఓరియేంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి.
(6 / 7)
సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. కాబట్టి దోస్త్ ద్వారా సీటు పొందే విద్యార్థులు... తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.,
(pixabay)(7 / 7)
దోస్త్ మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in/ లింక్ తో రిజిస్ట్రేషన్ తో పాటు ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు