
(1 / 5)
తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ సీపీగెట్ - 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు షురూ కానున్నాయి. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

(2 / 5)
ఎంట్రెన్స్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు... అక్టోబర్ 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 15వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ గడువు అక్టోబర్ 16వ తేదీతో ముగుస్తుంది.

(3 / 5)
అక్టోబర్ 17వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 21వ తేదీన సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

(4 / 5)
సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 24వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. అర్హులైన అభ్యర్థులు... https://cpget.ouadmissions.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

(5 / 5)
అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా https://cpget.tgche.ac.in/CPGET/CPGET_GetRankCard.aspx ఫలితాలను చూడవచ్చు. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్' లేదా 'ఫలితాలు' లింక్పై క్లిక్ చేయండి. మీకు అవసరమైన వివరాలను హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి.'వ్యూ ర్యాంక్ కార్డ్' పై క్లిక్ చేయండి. మీ ఫలితం, ర్యాంక్ కార్డ్ కనిపిస్తాయి.
ఇతర గ్యాలరీలు