AP TG Temperature Updates : వేసవి ముందే... భానుడి భగభగలు - పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు-temperatures are gradually increasing in telugu states weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Temperature Updates : వేసవి ముందే... భానుడి భగభగలు - పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

AP TG Temperature Updates : వేసవి ముందే... భానుడి భగభగలు - పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

Published Feb 15, 2025 08:03 AM IST Maheshwaram Mahendra Chary
Published Feb 15, 2025 08:03 AM IST

  • AP Telangaan Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి పూర్తి కాకముందే… భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రెండు మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు మరికొంత మేర పెరగనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫిబ్రవరి నెల దాటకముందే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది.

(1 / 8)

ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫిబ్రవరి నెల దాటకముందే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది.

(Photo Source @APSDMA Twitter)

ఉత్తర కోస్తా, ఏపీ, యానాంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా, సీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.  

(2 / 8)

ఉత్తర కోస్తా, ఏపీ, యానాంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా, సీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 

(Photo Source @APSDMA Twitter)

ఏపీలోని ఉత్తర కోస్తాలో చూస్తే ఇవాళ…. పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కూడా  పూర్తిగా పొడిగా ఉండనుంది.

(3 / 8)

ఏపీలోని ఉత్తర కోస్తాలో చూస్తే ఇవాళ…. పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కూడా  పూర్తిగా పొడిగా ఉండనుంది.

(image source unsplash.com)

దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌  ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఉండనుంది.

(4 / 8)

దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌  ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఉండనుంది.

(Image Source Pixabay )

రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు,పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

(5 / 8)

రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు,పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

(image source unsplash)

తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

(6 / 8)

తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

(Unsplash)

 శుక్రవారం తెలంగాణలో చూస్తే మహబూబ్ నగర్ లో అత్యధికంగా 36.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఖమ్మంలో 36.6, భద్రాచలంలో 35.6, హన్మకొండ -35 డిగ్రీలు, హైదరాబాద్ లో 34.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఏపీలోని నందిగామలో 36.1 డిగ్రీలు, విజయవాడలో 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(7 / 8)

 శుక్రవారం తెలంగాణలో చూస్తే మహబూబ్ నగర్ లో అత్యధికంగా 36.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఖమ్మంలో 36.6, భద్రాచలంలో 35.6, హన్మకొండ -35 డిగ్రీలు, హైదరాబాద్ లో 34.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఏపీలోని నందిగామలో 36.1 డిగ్రీలు, విజయవాడలో 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(image source pixabay )

గత వారం రోజులతో పోల్చితే… ఈ రెండు మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 1- 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలా ఉన్నప్పటికీ….  రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లొద్దని చెబుతున్నారు. 

(8 / 8)

గత వారం రోజులతో పోల్చితే… ఈ రెండు మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 1- 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలా ఉన్నప్పటికీ….  రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లొద్దని చెబుతున్నారు. 

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు