తెలంగాణపై ద్రోణి ఎఫెక్ట్- నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం-telangana weather forecast moderate rain today tomorrow temperature rise in some districts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణపై ద్రోణి ఎఫెక్ట్- నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణపై ద్రోణి ఎఫెక్ట్- నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Published Apr 20, 2025 03:27 PM IST Bandaru Satyaprasad
Published Apr 20, 2025 03:27 PM IST

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక, రాయలసీమ వరకు ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక, రాయలసీమ వరకు  ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

(1 / 6)

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక, రాయలసీమ వరకు ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. కాగా నిన్న ఆదిలాబాద్ లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

(2 / 6)

ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. కాగా నిన్న ఆదిలాబాద్ లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2- 3°C పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

(3 / 6)

రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2- 3°C పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నేడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

(4 / 6)

నేడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు(సోమవారం) తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణలోని నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

(5 / 6)

రేపు(సోమవారం) తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణలోని నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జనగామ జిల్లా నార్మెట్టలో 3 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా బాలా నగర్ లో 2 సెం.మీ. మల్కాజ్ గిరి జిల్లాలో షామీర్ పేట్ లో 2 సెం.మీ, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లెలో ఒక సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

(6 / 6)

నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జనగామ జిల్లా నార్మెట్టలో 3 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా బాలా నగర్ లో 2 సెం.మీ. మల్కాజ్ గిరి జిల్లాలో షామీర్ పేట్ లో 2 సెం.మీ, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లెలో ఒక సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

(@APSDMA)

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు