(1 / 7)
అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. రోడ్డు మార్గం ద్వారా…ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
(image source from unsplash.com)(2 / 7)
కేవలం రూ.6999తో హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.
(image source from unsplash.com)(3 / 7)
Araku Tour - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 4 రోజులు ట్రిప్ కొనసాగుతుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరితో పాటు మరికొన్ని ప్రాంతాలను చూస్తారు.
(image source from unsplash.com)(4 / 7)
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
(image source from unsplash.com)(5 / 7)
ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు. .
(image source from unsplash.com)(6 / 7)
నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(image source from unsplash.com)(7 / 7)
నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/package/ArakuTour లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
(image source from unsplash.com)ఇతర గ్యాలరీలు