(1 / 6)
ఉత్తర తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉంది. ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఆదిలాబాద్ 44, ఆసిఫాబాద్ 43.8, నిర్మల్ 43.8, మంచిర్యాల 43.7, జగిత్యాల 43.6, సిరిసిల్ల 43.5, పెద్దపల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
(unsplash)(2 / 6)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా తీవ్రమైన వేడి ఉంది. మొదటిసారి ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ దాటింది. బంజారాహిల్స్ 41.6, ముషీరాబాద్ 41.6, గాజులరామారం 41.5, హబ్సిగూడ 41.5, చార్మినార్ 41.4, ఖైరతాబాద్లో 41.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది.
(unsplash)(3 / 6)
రాష్ట్రంలోని సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో వర్షం కురిసింది. నారాయణపేటలో భారీ వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉంది.
(unsplash)(4 / 6)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు కొల్లూరు, శంకర్పల్లి తేలికపాటి వర్షం కురిసింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో వర్షం పడటం లేదు. వాతావరణం పొడిగా ఉంది.
(unsplash)(5 / 6)
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో.. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య ఎండలో తిరగడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా తలపాగా వాడాలని స్పష్టం చేస్తున్నారు. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.
(unsplash)(6 / 6)
డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే రోజంతా తగినంత నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా సరే, క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజసిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి, పోషకాలను అందిస్తాయి. వేడి పెరుగుతున్న సమయంలో ఇవి చాలా అవసరం.
(unsplash)ఇతర గ్యాలరీలు