(1 / 7)
రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా… అర్హులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దరఖాస్తులను పరిశీలిస్తోంది.
(2 / 7)
అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం పై సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు ఇచ్చారు.
(3 / 7)
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా పూర్తి చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారం…. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02న మంజూరు పత్రాలు పంపిణీకి సిద్ధం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.
(4 / 7)
స్వయం ఉపాధి రుణాల మంజూరు కోసం రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారుల జాబితాను వెల్లడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
(5 / 7)
మండల స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన వాటిని జిల్లా స్థాయి కమిటీకి పంపుతుతున్నారు. ఇదంతా కూడా మే 20లోపు పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత అర్హులను గుర్తిస్తారు. మండలాల వారీగా పేర్లను వెల్లడిస్తారు.
(6 / 7)
ఈ స్కీమ్ కింద అర్హత సాధించిన వారికి జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలను జారీ చేస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది.
(7 / 7)
ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
(image source istockphoto)ఇతర గ్యాలరీలు