జూన్ 2న 'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ శాంక్షన్ లెటర్లు - ముందుగా వీరికే...!-telangana rajiv yuva vikasam scheme sanction letters will be provided to 5 lakh youth on june 2 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జూన్ 2న 'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ శాంక్షన్ లెటర్లు - ముందుగా వీరికే...!

జూన్ 2న 'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ శాంక్షన్ లెటర్లు - ముందుగా వీరికే...!

Published May 23, 2025 06:22 PM IST Maheshwaram Mahendra Chary
Published May 23, 2025 06:22 PM IST

రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జూన్ 2వ తేదీన 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రూ.లక్షలోపు రుణాలు మంజూరు చేయనుంది. మరో విడతలో మిగతా కేటగిరీలోని వారికి రుణాలను అందజేయనుంది.

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం  రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ ను అమలు చేస్తోంది.

(1 / 8)

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ ను అమలు చేస్తోంది.

(image source istockphoto)

రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే… అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు అందాయి. ఏకంగా 16 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకోవటంతో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

(2 / 8)

రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే… అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు అందాయి. ఏకంగా 16 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకోవటంతో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

చాలా జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా… జూన్ 2వ తేదీన 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లను ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు.

(3 / 8)

చాలా జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా… జూన్ 2వ తేదీన 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లను ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు.

రాజీవ్ యువ వికాసం స్కీం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించగా.. రూ. 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. అయితే ముందుగా కేటగిరీ-1, 2 యూనిట్లను కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. ఆ తర్వాత కేటగిరి 3, 4లో ఉన్న వారికి శాంక్షన్ లెటర్లు అందజేయనుంది.

(4 / 8)

రాజీవ్ యువ వికాసం స్కీం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించగా.. రూ. 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. అయితే ముందుగా కేటగిరీ-1, 2 యూనిట్లను కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. ఆ తర్వాత కేటగిరి 3, 4లో ఉన్న వారికి శాంక్షన్ లెటర్లు అందజేయనుంది.

మే 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఆయా కార్పొరేషన్ల అనుమతితో శాంక్షన్ లెటర్లను సిద్ధం చేయనున్నారు.

(5 / 8)

మే 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఆయా కార్పొరేషన్ల అనుమతితో శాంక్షన్ లెటర్లను సిద్ధం చేయనున్నారు.

కేటగిరి 1 కింద రూ. 50 వేల రుణం ఉండదా… కేటగిరి 2 కింద రూ. 1 లక్షలోపు యూనిట్లు ఉన్నాయి. ముందుగా కేటగిరి 1, 2లోని లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు అందించాలనే యోచనలో సర్కార్ ఉంది.

(6 / 8)

కేటగిరి 1 కింద రూ. 50 వేల రుణం ఉండదా… కేటగిరి 2 కింద రూ. 1 లక్షలోపు యూనిట్లు ఉన్నాయి. ముందుగా కేటగిరి 1, 2లోని లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు అందించాలనే యోచనలో సర్కార్ ఉంది.

ఇక దరఖాస్తుదారుల్లో అనర్హులను పక్కనపెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అధికారులు వినియోగిస్తున్నారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లలో కార్పొరేషన్ కింద ఏమైనా రుణాలు, స్కీమ్ లు పొందరా..? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.

(7 / 8)

ఇక దరఖాస్తుదారుల్లో అనర్హులను పక్కనపెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అధికారులు వినియోగిస్తున్నారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లలో కార్పొరేషన్ కింద ఏమైనా రుణాలు, స్కీమ్ లు పొందరా..? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.

దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్ ఇవ్వొద్దని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

(8 / 8)

దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్ ఇవ్వొద్దని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు