(1 / 6)
ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలు పడనున్నాయి. అయితే తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(2 / 6)
ఏపీలో ఇవాళ(ఆగస్టు 25) చూస్తే... తూర్పుగోదావరి,ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.•
(3 / 6)
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
ఇవాళ తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 6)
పైన పేర్కొన్న జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
(6 / 6)
ఆగస్టు 26వ తేదీ నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే పడుతాయని తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని శనివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ లో వివరించింది.
ఇతర గ్యాలరీలు