(1 / 6)
(2 / 6)
ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.
(3 / 6)
పలు రకాల సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
(4 / 6)
కేబినెెట్ భేటీలో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా… తాజాగా(ఆగస్టు 08) ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఛైర్మన్గా, ఉప కమిటీని ఏర్పాటు చేసింది.
(5 / 6)
మంత్రివర్గ ఉప సంఘంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి.. ఆ తర్వాత విధి విధానాలను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
(6 / 6)
ఇతర గ్యాలరీలు