(1 / 6)
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్రామాల్లో ఇంకా లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ కాలేదు. అయితే ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది.
(2 / 6)
ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 70,122 మందికి ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో కొంత వరకు లబ్ధిదారులు ముగ్గు పోసి పనులు కొనసాగిస్తున్నారు. మిగతా అన్ని గ్రామాల్లోనూ ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది.
(3 / 6)
ఈ నెలాఖారు నాటికి లబ్ధిదారులను గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలనే దానిపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
(4 / 6)
అనర్హులకు ఇవ్వకుండా పక్కాగా అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అర్హులను గుర్తించేందుకు ఇందిరమ్మ కమిటీలు కీలకంగా పని చేయనున్నారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు.
(5 / 6)
ఏప్రిల్ 20వ తేదీ తర్వాత జిల్లా అధికారులతో సూపర్ చెక్ నిర్వహించనున్నారు. ఈ నెలాఖారు లేదా మే తొలి వారంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
ఇతర గ్యాలరీలు