ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల గుర్తింపునకు యాక్షన్ ప్లాన్..! పకడ్బందీగా అమలు-telangana govt action plan to identify beneficiaries of indiramma houses ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల గుర్తింపునకు యాక్షన్ ప్లాన్..! పకడ్బందీగా అమలు

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల గుర్తింపునకు యాక్షన్ ప్లాన్..! పకడ్బందీగా అమలు

Published Apr 18, 2025 03:18 PM IST Maheshwaram Mahendra Chary
Published Apr 18, 2025 03:18 PM IST

  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో వేగం పెంచాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. మొదటి విడతలో గుర్తించిన గ్రామాలు కాకుండా.. మిగతా అన్నిచోట్ల లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. క్షేత్రస్థాయి పరిశీలన నుంచి ప్రోసిడింగ్స్ ఇచ్చే వరకు పక్కాగా అడుగులు వేయనుంది.

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్రామాల్లో ఇంకా లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ కాలేదు. అయితే ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది.

(1 / 6)

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్రామాల్లో ఇంకా లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ కాలేదు. అయితే ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది.

ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత  కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 70,122 మందికి ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో కొంత వరకు లబ్ధిదారులు ముగ్గు పోసి పనులు కొనసాగిస్తున్నారు. మిగతా అన్ని గ్రామాల్లోనూ ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది.

(2 / 6)

ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 70,122 మందికి ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో కొంత వరకు లబ్ధిదారులు ముగ్గు పోసి పనులు కొనసాగిస్తున్నారు. మిగతా అన్ని గ్రామాల్లోనూ ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది.

ఈ నెలాఖారు నాటికి లబ్ధిదారులను గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలనే దానిపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు.

(3 / 6)

ఈ నెలాఖారు నాటికి లబ్ధిదారులను గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలనే దానిపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు.

అనర్హులకు ఇవ్వకుండా పక్కాగా అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అర్హులను గుర్తించేందుకు ఇందిరమ్మ కమిటీలు కీలకంగా పని చేయనున్నారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు.

(4 / 6)

అనర్హులకు ఇవ్వకుండా పక్కాగా అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అర్హులను గుర్తించేందుకు ఇందిరమ్మ కమిటీలు కీలకంగా పని చేయనున్నారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు.

ఏప్రిల్ 20వ తేదీ తర్వాత జిల్లా అధికారులతో సూపర్ చెక్ నిర్వహించనున్నారు. ఈ నెలాఖారు లేదా మే తొలి వారంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

(5 / 6)

ఏప్రిల్ 20వ తేదీ తర్వాత జిల్లా అధికారులతో సూపర్ చెక్ నిర్వహించనున్నారు. ఈ నెలాఖారు లేదా మే తొలి వారంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత… ప్రోసిడింగ్స్ కాపీని అందజేస్తారు. ఈ ప్రక్రియ మే మొదటి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే… ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.

(6 / 6)

అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత… ప్రోసిడింగ్స్ కాపీని అందజేస్తారు. ఈ ప్రక్రియ మే మొదటి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే… ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు