(1 / 6)
తెలంగాణలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.
(2 / 6)
గత విద్యా సంవత్సరానికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులు కాగా ఇప్పటివరకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా కొంత మంది విద్యార్థులు మిగిలిపోవటంతో అధికారులు జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
(3 / 6)
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును పొడిగించారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో… అధికారులు జూన్ 30 వరకు అవకాశం కల్పించారు. అయితే ఇందుకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో… మిగిలిపోయిన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ లేదా రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
(4 / 6)
నిజానికి ఉపకారవేతనాల గడువు గతేడాది డిసెంబర్ లో పూర్తయింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు…పలుమార్లు పొడిగించారు. ఈ క్రమంలోనే… అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని…మే 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో జూన్ 30 వరకు అవకాశం కల్పించారు.
(5 / 6)
అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.
(6 / 6)
కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోవాలి.
ఇతర గ్యాలరీలు