Half Day Schools : ఒంటిపూట బడుల సమయాలపై తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ, తొలి గంట ఎప్పుడంటే?-telangana education department announces half days clarifies on school timings due to summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Half Day Schools : ఒంటిపూట బడుల సమయాలపై తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ, తొలి గంట ఎప్పుడంటే?

Half Day Schools : ఒంటిపూట బడుల సమయాలపై తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ, తొలి గంట ఎప్పుడంటే?

Published Mar 16, 2025 03:07 PM IST Bandaru Satyaprasad
Published Mar 16, 2025 03:07 PM IST

Half Day Schools : తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 15 నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడుల సమయాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఉదయం 7.45 గంటలకు మొదటి గంట కొట్టాలని, 7.50 గంటలకు స్కూల్‌ అసెంబ్లీ జరపాలని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 15 నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడుల సమయాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఉదయం 7.45 గంటలకు మొదటి గంట కొట్టాలని, 7.50 గంటలకు స్కూల్‌ అసెంబ్లీ జరపాలని పేర్కొంది. 

(1 / 6)

తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 15 నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడుల సమయాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఉదయం 7.45 గంటలకు మొదటి గంట కొట్టాలని, 7.50 గంటలకు స్కూల్‌ అసెంబ్లీ జరపాలని పేర్కొంది. 

ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.15 గంటల నుంచి తరగతులు అని ప్రచారం జరిగింది. దీనిపై విద్యాశాఖ స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

(2 / 6)

ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.15 గంటల నుంచి తరగతులు అని ప్రచారం జరిగింది. దీనిపై విద్యాశాఖ స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

తెలంగాణ పదో తరగతి పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 

(3 / 6)

తెలంగాణ పదో తరగతి పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్కూళ్లకు ఒంటిపూట బడులు ప్రారంభించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23కు తెలంగాణ, ఏప్రిల్ 24 వరకు ఏపీలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. 

(4 / 6)

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్కూళ్లకు ఒంటిపూట బడులు ప్రారంభించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23కు తెలంగాణ, ఏప్రిల్ 24 వరకు ఏపీలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. 

ఏపీలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట బడులు  కొనసాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.  

(5 / 6)

ఏపీలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట బడులు  కొనసాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.  

 ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పాఠశాలలో తాగునీటి ఏర్పాటు చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ వారి సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పాఠశాలలలో అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ సూచించింది. పాఠశాల సమయం ముగిసిన తరువాత విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

(6 / 6)

 ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పాఠశాలలో తాగునీటి ఏర్పాటు చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ వారి సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పాఠశాలలలో అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ సూచించింది. పాఠశాల సమయం ముగిసిన తరువాత విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు