(1 / 7)
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
(image source istock.com)(2 / 7)
ఈ వారం లేదా వచ్చే వారంలోనే దోస్త్ నోటిఫికేషన్ 2025 విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విధివిధానాలు ఖరారైనట్లు సమాచారం. దీని ద్వారా 2025 -2025 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు.
(HT Telugu )(3 / 7)
ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
(image source istock.com)(4 / 7)
దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
(5 / 7)
ఈ ఏడాదికి సంబంధించి దోస్త్ కన్వీనర్గా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వ్యవహరించనున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన… ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమితులయ్యారు.
(image source istock.com)(6 / 7)
గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ అవకాశం కూడా కల్పించారు.
(7 / 7)
దోస్త్ నోటిఫికేషన్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం https://tgche.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
ఇతర గ్యాలరీలు