తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - త్వరలోనే 'దోస్త్‌' నోటిఫికేషన్‌..!-telangana dost 2025 notification for degree admissions will be issued soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - త్వరలోనే 'దోస్త్‌' నోటిఫికేషన్‌..!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - త్వరలోనే 'దోస్త్‌' నోటిఫికేషన్‌..!

Published Apr 25, 2025 09:11 PM IST Maheshwaram Mahendra Chary
Published Apr 25, 2025 09:11 PM IST

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి కార్యాచరణను సిద్ధం చేసింది. దీని ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

(1 / 7)

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

(image source istock.com)

ఈ వారం లేదా వచ్చే వారంలోనే దోస్త్ నోటిఫికేషన్ 2025 విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విధివిధానాలు ఖరారైనట్లు సమాచారం.  దీని ద్వారా 2025 -2025 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు.

(2 / 7)

ఈ వారం లేదా వచ్చే వారంలోనే దోస్త్ నోటిఫికేషన్ 2025 విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విధివిధానాలు ఖరారైనట్లు సమాచారం. దీని ద్వారా 2025 -2025 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు.

(HT Telugu )

ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

(3 / 7)

ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

(image source istock.com)

దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని  ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

(4 / 7)

దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

(image source istock.com)

ఈ ఏడాదికి సంబంధించి దోస్త్‌ కన్వీనర్‌గా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి వ్యవహరించనున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన… ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమితులయ్యారు.

(5 / 7)

ఈ ఏడాదికి సంబంధించి దోస్త్‌ కన్వీనర్‌గా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి వ్యవహరించనున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన… ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా నియమితులయ్యారు.

(image source istock.com)

గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ అవకాశం కూడా కల్పించారు.

(6 / 7)

గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ అవకాశం కూడా కల్పించారు.

(imagimage source istock)

దోస్త్ నోటిఫికేషన్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం https://tgche.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

(7 / 7)

దోస్త్ నోటిఫికేషన్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం https://tgche.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు