తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… ‘దోస్త్’ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి-telangana dost 2025 first phase seats alloted key details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… ‘దోస్త్’ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… ‘దోస్త్’ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి

Published May 29, 2025 04:59 PM IST Maheshwaram Mahendra Chary
Published May 29, 2025 04:59 PM IST

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి సీట్లను కేటాయించారు. dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను గురువారం కేటాయించారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి మాత్రమే సీట్లను కేటాయించారు.

(1 / 8)

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను గురువారం కేటాయించారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి మాత్రమే సీట్లను కేటాయించారు.

 ఫస్ట్ ఫేజ్ కింద 87 వేలకుపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి మాత్రమే సీట్లను అలాట్ చేశారు. అలాట్ మెంట్ అర్డర్ కాపీని https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(2 / 8)

ఫస్ట్ ఫేజ్ కింద 87 వేలకుపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి మాత్రమే సీట్లను అలాట్ చేశారు. అలాట్ మెంట్ అర్డర్ కాపీని https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దోస్త్ రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా వెబ్ సైట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది. సీటు ఖరారు కానీ విద్యార్థులు…. మరో విడతలో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

(3 / 8)

దోస్త్ రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా వెబ్ సైట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది. సీటు ఖరారు కానీ విద్యార్థులు…. మరో విడతలో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

దోస్త్ 2025 ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు మే 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగుస్తుంది. సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే… వారి సీటు రద్దు అవుతుంది.

(4 / 8)

దోస్త్ 2025 ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు మే 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగుస్తుంది. సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే… వారి సీటు రద్దు అవుతుంది.

అలాట్ మెంట్ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు లోపు రిపోర్టింగ్ తప్పకుండా చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది. ఆ తర్వాత… మళ్లీ రిపోర్టింగ్ కు అవకాశం ఉండదు.

(5 / 8)

అలాట్ మెంట్ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు లోపు రిపోర్టింగ్ తప్పకుండా చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది. ఆ తర్వాత… మళ్లీ రిపోర్టింగ్ కు అవకాశం ఉండదు.

(pixabay)

తెలంగాణ దోస్త్ 2025 సెకండ్ ఫేజ్ ప్రక్రియ మే 30 నుంచి షురూ అవుతుంది. జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.

(6 / 8)

తెలంగాణ దోస్త్ 2025 సెకండ్ ఫేజ్ ప్రక్రియ మే 30 నుంచి షురూ అవుతుంది. జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.

మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలవుతుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్‌ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.

(7 / 8)

మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలవుతుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్‌ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.

(HT Telugu )

3 విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉండే స్పెషల్ ఫేజ్ ను ప్రకటించారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

(8 / 8)

3 విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉండే స్పెషల్ ఫేజ్ ను ప్రకటించారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

(pixabay)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు