TG SSC Exam Results 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల అప్డేట్స్ - ఏప్రిల్ 7 నుంచి స్పాట్ వాల్యుయేషన్, ఇవిగో వివరాలు-telangana 10th class evaluation will start from april 7 to 15th 2025 key updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Ssc Exam Results 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల అప్డేట్స్ - ఏప్రిల్ 7 నుంచి స్పాట్ వాల్యుయేషన్, ఇవిగో వివరాలు

TG SSC Exam Results 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల అప్డేట్స్ - ఏప్రిల్ 7 నుంచి స్పాట్ వాల్యుయేషన్, ఇవిగో వివరాలు

Published Mar 22, 2025 09:22 AM IST Maheshwaram Mahendra Chary
Published Mar 22, 2025 09:22 AM IST

  • TG SSC Exams Paper Evaluation 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగానే… స్పాట్ వాల్యూయేషన్ కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పరీక్షలు పూర్తైన వెంటనే వాల్యూయేషన్ చేయనున్నారు. ఏప్రిల్ 4 నుంచి 15 తేదీల మధ్య పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు. అప్డేట్స్ ఇక్కడ చూడండి

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 4తో అన్ని ఎగ్జామ్స్ పూర్తవుతాయి. అయితే ఆ వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం చేసేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.

(1 / 6)

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4తో అన్ని ఎగ్జామ్స్ పూర్తవుతాయి. అయితే ఆ వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం చేసేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.

పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయనున్నారు.

(2 / 6)

పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయనున్నారు.

ఏప్రిల్ 4వ తేదీన పరీక్షలు పూర్తి కాగానే… ఆ వెంటనే  స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు. ఇందుకోసం ఇప్పటికే సిబ్బందిని కూడా విద్యాశాఖ నియమించింది. స్పాట్ లోనే పాల్గొనే వారి వివరాలను కూడా సిద్ధం చేసింది.

(3 / 6)

ఏప్రిల్ 4వ తేదీన పరీక్షలు పూర్తి కాగానే… ఆ వెంటనే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు. ఇందుకోసం ఇప్పటికే సిబ్బందిని కూడా విద్యాశాఖ నియమించింది. స్పాట్ లోనే పాల్గొనే వారి వివరాలను కూడా సిద్ధం చేసింది.

ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ జరగుతుంది. ఇందుకోసం మొత్తం 19 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

(4 / 6)

ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ జరగుతుంది. ఇందుకోసం మొత్తం 19 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్పాట్ పూర్తైన వెంటనే మార్కులను ఎంట్రీ చేస్తారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి… తుది ఫలితాల ప్రకటనకు సిద్ధం చేస్తారు. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే… ఫలితాల తేదీని ప్రకటిస్తారు. https://bse.telangana.gov.in/  వెబ్ సైట్ లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

(5 / 6)

స్పాట్ పూర్తైన వెంటనే మార్కులను ఎంట్రీ చేస్తారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి… తుది ఫలితాల ప్రకటనకు సిద్ధం చేస్తారు. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే… ఫలితాల తేదీని ప్రకటిస్తారు. https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 11,547 పాఠశాలల నుంచి మొత్తం 5,09,403 మంది (బాలురు: 2,58,895, బాలికలు: 2,50,508) విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాలకు 2650 చీఫ్ సూపరింటెండెంట్లు, 2650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28,100 ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. లీకేజీ వంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

(6 / 6)

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 11,547 పాఠశాలల నుంచి మొత్తం 5,09,403 మంది (బాలురు: 2,58,895, బాలికలు: 2,50,508) విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాలకు 2650 చీఫ్ సూపరింటెండెంట్లు, 2650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28,100 ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. లీకేజీ వంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు