ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్లు వీళ్లే.. కేవలం నలుగురే.. మరి శుభ్‌మన్ గిల్ చేయగలడా?-team india captains with test hundreds on england soil from pataudi to virat kohli subhman gill ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్లు వీళ్లే.. కేవలం నలుగురే.. మరి శుభ్‌మన్ గిల్ చేయగలడా?

ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్లు వీళ్లే.. కేవలం నలుగురే.. మరి శుభ్‌మన్ గిల్ చేయగలడా?

Published Jun 18, 2025 03:17 PM IST Hari Prasad S
Published Jun 18, 2025 03:17 PM IST

భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లీడ్స్ లో జరగనుంది. మరి ఇప్పటి వరకూ ఇంగ్లండ్ లో ఎంతమంది భారత కెప్టెన్లు సెంచరీలు సాధించారో తెలుసా?

ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఇప్పటి వరకూ కేవలం నలుగురు టీమిండియా కెప్టెన్లు మాత్రమే సెంచరీలు చేశారు. మరి ఇప్పుడు 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ కూడా ఆ ఘనతను అందుకుంటాడా? ఆ అరుదైన క్లబ్ లో చేరతాడా అన్నది చూడాలి.

(1 / 5)

ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఇప్పటి వరకూ కేవలం నలుగురు టీమిండియా కెప్టెన్లు మాత్రమే సెంచరీలు చేశారు. మరి ఇప్పుడు 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ కూడా ఆ ఘనతను అందుకుంటాడా? ఆ అరుదైన క్లబ్ లో చేరతాడా అన్నది చూడాలి.

(PTI)

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్ ఇతడే. 1967లో లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు.

(2 / 5)

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్ ఇతడే. 1967లో లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు.

(ICC)

మహ్మద్ అజారుద్దీన్ - పటౌడీ తర్వాత 23 ఏళ్ల పాటు ఇంగ్లండ్ లో ఏ భారత కెప్టెన్ సెంచరీ చేయలేదు. తర్వాత మహమ్మద్ అజారుద్దీన్ 1990లో ఇంగ్లండ్ పర్యటనలో రెండు సెంచరీలు సాధించాడు. లార్డ్స్ లో 121, మాంచెస్టర్లో 179 పరుగులు చేశాడు.

(3 / 5)

మహ్మద్ అజారుద్దీన్ - పటౌడీ తర్వాత 23 ఏళ్ల పాటు ఇంగ్లండ్ లో ఏ భారత కెప్టెన్ సెంచరీ చేయలేదు. తర్వాత మహమ్మద్ అజారుద్దీన్ 1990లో ఇంగ్లండ్ పర్యటనలో రెండు సెంచరీలు సాధించాడు. లార్డ్స్ లో 121, మాంచెస్టర్లో 179 పరుగులు చేశాడు.

(X)

సౌరవ్ గంగూలీ - ఈ జాబితాలో మూడో పేరు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. గంగూలీ 2002లో ఇంగ్లండ్ గడ్డపై 128 పరుగులు చేశాడు. లీడ్స్ మైదానంలో అతను ఈ అద్భుతం చేశాడు.

(4 / 5)

సౌరవ్ గంగూలీ - ఈ జాబితాలో మూడో పేరు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. గంగూలీ 2002లో ఇంగ్లండ్ గడ్డపై 128 పరుగులు చేశాడు. లీడ్స్ మైదానంలో అతను ఈ అద్భుతం చేశాడు.

(X)

విరాట్ కోహ్లీ - ఇంగ్లండ్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. 2018లో ఇంగ్లండ్ పర్యటనలో బర్మింగ్హామ్ లో 149, నాటింగ్హామ్ లో 103 పరుగులు చేశాడు.

(5 / 5)

విరాట్ కోహ్లీ - ఇంగ్లండ్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. 2018లో ఇంగ్లండ్ పర్యటనలో బర్మింగ్హామ్ లో 149, నాటింగ్హామ్ లో 103 పరుగులు చేశాడు.

(AP)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు