(1 / 6)
అజిత్ వాడేకర్ - ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్ అజిత్ వాడేకర్. 1971లో వాడేకర్ సారథ్యంలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. ఆ తర్వాత భారత జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లగా అందులో రెండు డ్రా అయ్యాయి.
(BCCI)(2 / 6)
కపిల్ దేవ్ - ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 1986లో ఇంగ్లండ్ లో రెండు సార్లు విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో 279 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో చివరి టెస్టు డ్రాగా ముగిసింది.
(ICC)(3 / 6)
సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2002లో ఇంగ్లండ్ ను ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఓడించింది. అయితే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది.
(X)(4 / 6)
రాహుల్ ద్రవిడ్ - 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో భారత్ ఇంగ్లండ్ లో విజయాన్ని రుచి చూసింది. నాటింగ్హామ్ లో ఆతిథ్య జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.
(X)(5 / 6)
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2014లో ఇంగ్లండ్ పై భారత్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ధోనీ సేన 1-3 తేడాతో పరాజయం పాలైంది.
(ICC)(6 / 6)
విరాట్ కోహ్లీ - ఇంగ్లండ్ లో అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట నమోదైంది. కోహ్లీ నాయకత్వంలో భారత్ ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు గెలిచింది. 2018లో భారత్ 203 పరుగుల తేడాతో, 2021లో 151, 157 పరుగుల తేడాతో విజయాలు సాధించింది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ తలపడనుంది. కొత్త టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రాబోయే సిరీస్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టగలడా లేదా అన్నది చూడాలి.
(HT)ఇతర గ్యాలరీలు