ఐపీఎల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. వరుసగా 12 మ్యాచ్‌లలో..-suryakumar yadav breaks sachin tendulkar record in ipl mumbai indians vs gujarat titans ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐపీఎల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. వరుసగా 12 మ్యాచ్‌లలో..

ఐపీఎల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. వరుసగా 12 మ్యాచ్‌లలో..

Published May 06, 2025 10:45 PM IST Hari Prasad S
Published May 06, 2025 10:45 PM IST

ఐపీఎల్ 2025లో సూర్య కుమార్ యాదవ్ టాప్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తాజాగా గుటరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకీ స్కై బ్రేక్ చేసిన ఆ రికార్డు ఏంటో చూడండి.

ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటన్స్ పై సూర్య 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్ లో సూర్యకుమార్ కు ఇది 12వ మ్యాచ్. ఈ 12 మ్యాచ్ ల్లో 25కు పైగా పరుగులు చేశాడు.

(1 / 8)

ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటన్స్ పై సూర్య 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్ లో సూర్యకుమార్ కు ఇది 12వ మ్యాచ్. ఈ 12 మ్యాచ్ ల్లో 25కు పైగా పరుగులు చేశాడు.

(REUTERS)

ఐపీఎల్లో ఇదో రికార్డు. ఇన్ని మ్యాచ్ లలో ఎవరూ వరుసగా 25 పరుగులకు మించి పరుగులు చేయలేదు. పురుషుల టి20 క్రికెట్ లో వరుసగా 13 ఇన్నింగ్స్ లలో 25కు పైగా పరుగులు చేసిన రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన టెంబా బవుమా పేరిట ఉంది.

(2 / 8)

ఐపీఎల్లో ఇదో రికార్డు. ఇన్ని మ్యాచ్ లలో ఎవరూ వరుసగా 25 పరుగులకు మించి పరుగులు చేయలేదు. పురుషుల టి20 క్రికెట్ లో వరుసగా 13 ఇన్నింగ్స్ లలో 25కు పైగా పరుగులు చేసిన రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన టెంబా బవుమా పేరిట ఉంది.

(REUTERS)

గుజరాత్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి సూర్యకుమార్ ప్రస్తుత సీజన్లో మొత్తం 510 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.

(3 / 8)

గుజరాత్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి సూర్యకుమార్ ప్రస్తుత సీజన్లో మొత్తం 510 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.

(Hindustan Times)

ఐపీఎల్ 2025లో వాంఖడే వేదికగా జీటీతో జరిగిన మ్యాచ్ లో 35 పరుగులతో 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఒకే సీజన్ లో 500 పరుగుల మైలురాయిని దాటడం ఇది మూడోసారి. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సార్లు 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

(4 / 8)

ఐపీఎల్ 2025లో వాంఖడే వేదికగా జీటీతో జరిగిన మ్యాచ్ లో 35 పరుగులతో 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఒకే సీజన్ లో 500 పరుగుల మైలురాయిని దాటడం ఇది మూడోసారి. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సార్లు 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

(AP)

దీంతో సచిన్ టెండూల్కర్, క్వింటన్ డికాక్ రికార్డులను సూర్య బద్దలు కొట్టాడు.

(5 / 8)

దీంతో సచిన్ టెండూల్కర్, క్వింటన్ డికాక్ రికార్డులను సూర్య బద్దలు కొట్టాడు.

(AFP)

2018, 2023, 2025 సీజన్లలో ముంబై తరఫున సూర్య 500 పరుగుల మైలురాయిని దాటాడు.

(6 / 8)

2018, 2023, 2025 సీజన్లలో ముంబై తరఫున సూర్య 500 పరుగుల మైలురాయిని దాటాడు.

(Surjeet Yadav)

సచిన్ టెండూల్కర్ 2010, 2011లో 500కు పైగా పరుగులు చేయగా.. క్వింటన్ డికాక్ 2019, 2020లో ఎంఐ తరఫున 500కు పైగా పరుగులు చేశాడు.

(7 / 8)

సచిన్ టెండూల్కర్ 2010, 2011లో 500కు పైగా పరుగులు చేయగా.. క్వింటన్ డికాక్ 2019, 2020లో ఎంఐ తరఫున 500కు పైగా పరుగులు చేశాడు.

(PTI)

సూర్యకుమార్ ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అతను మొదట 2012, 2013లో ఎంఐ తరఫున ఆడాడు. 2014 నుండి 2017 వరకు కేకేఆర్ తరఫున ఆడాడు. మళ్లీ 2018 నుండి ముంబై జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు.

(8 / 8)

సూర్యకుమార్ ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అతను మొదట 2012, 2013లో ఎంఐ తరఫున ఆడాడు. 2014 నుండి 2017 వరకు కేకేఆర్ తరఫున ఆడాడు. మళ్లీ 2018 నుండి ముంబై జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు.

(AFP)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు