(1 / 7)
తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
(2 / 7)
భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో… రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చింది.
(3 / 7)
భూ భారతి చట్టం ప్రకారం… ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే సర్వే మ్యాప్ తప్పనిసరి కానుంది. సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని చట్టంలో పొందుపరిచారు. దీంతో సర్వేయర్ల పాత్ర కీలకంగా ఉండనుంది.
(4 / 7)
భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపిస్తారు. మ్యాప్ తయారు చేస్తారు. ఇందుకుగాను అధిక సంఖ్యలో సర్వేయర్లు అవసరమని సర్కార్ భావిస్తోంది. వీరి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.
(5 / 7)
ఈ సర్వే మ్యాప్ లో సదరు భూమి యొక్క హద్దులను వివరంగా పొందుపరుస్తారు. విక్రయించే భూమి లేదా హక్కుల మార్పిడి భూమి యొక్క విస్తీరణంతో పాటు ప్రతి అంశాన్ని ఇందులో వివరిస్తారు. మ్యాప్ ను జత చేసిన తర్వాతే… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
(6 / 7)
సర్టిఫైయిడ్ సర్వేయర్ ద్వారానే ఈ ప్రక్రియను చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం సర్వేయర్ల కొరత ఉంది. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ల ఉంటాయి కాబట్టి… ప్రైవేట్ సర్వేయర్ల సేవలను కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే వీరికి ప్రభుత్వం నుంచి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.
(7 / 7)
భూ భారతి పోర్టల్ సేవల వివరాలను తెలుసుకునేందుకు https://bhubharati.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. ఇందులో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి పోర్టల్ ఆధారంగా సేవలు అందుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటన చేసింది.
ఇతర గ్యాలరీలు