ఏపీలో నేటి నుంచి మళ్లీ పెరుగనున్న వేసవి ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు-summer temperatures to rise again in ap from today heatwave warnings issued for several districts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీలో నేటి నుంచి మళ్లీ పెరుగనున్న వేసవి ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు

ఏపీలో నేటి నుంచి మళ్లీ పెరుగనున్న వేసవి ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు

Published May 08, 2025 07:23 AM IST Sarath Chandra.B
Published May 08, 2025 07:23 AM IST

ఏపీలో వేసవి ఉష్ణోగ్రతలు నేటి క్రమంగా పెరుగనున్నాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి తగ్గు ముఖం పట్టిన వడగాలులు మళ్ళీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం సింహాద్రిపురం, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా నేమకల్లు,పల్నాడు జిల్లా కాకానిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏప్రిల్ నుంచి తగ్గు ముఖం పట్టిన వడగాలులు మళ్ళీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది. ఆకస్మిక వర్షాలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపించాయి.

(1 / 7)

ఏప్రిల్ నుంచి తగ్గు ముఖం పట్టిన వడగాలులు మళ్ళీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది. ఆకస్మిక వర్షాలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపించాయి.

గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో నమోదు కావొ చ్చని, శుక్రవారం నుంచి తీవ్రత పెరగొచ్చని విప త్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది.

(2 / 7)

గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో నమోదు కావొ చ్చని, శుక్రవారం నుంచి తీవ్రత పెరగొచ్చని విప త్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతా వరణ శాఖ తెలిపింది.

(3 / 7)

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతా వరణ శాఖ తెలిపింది.

బుధవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకి నాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. రాత్రి 7 గంటల వరకు అత్య దికంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 86. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

(4 / 7)

బుధవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకి నాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. రాత్రి 7 గంటల వరకు అత్య దికంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 86. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బుధ వారం సింహాద్రిపురం (వైఎస్సార్) లో 40.7, గుల్ల దుర్తి (నంద్యాల), నేమకల్లు (కర్నూలు)లో 40.6, కాకాని (పల్నాడు)లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. గురువారం (08-05-25) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

(5 / 7)

బుధ వారం సింహాద్రిపురం (వైఎస్సార్) లో 40.7, గుల్ల దుర్తి (నంద్యాల), నేమకల్లు (కర్నూలు)లో 40.6, కాకాని (పల్నాడు)లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. గురువారం (08-05-25) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

(Photo Source From unsplash.com)

గురువారం పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది.  శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

(6 / 7)

గురువారం పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

(7 / 7)

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు