(1 / 7)
ఏప్రిల్ నుంచి తగ్గు ముఖం పట్టిన వడగాలులు మళ్ళీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది. ఆకస్మిక వర్షాలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపించాయి.
(2 / 7)
గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో నమోదు కావొ చ్చని, శుక్రవారం నుంచి తీవ్రత పెరగొచ్చని విప త్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది.
(3 / 7)
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతా వరణ శాఖ తెలిపింది.
(4 / 7)
బుధవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకి నాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. రాత్రి 7 గంటల వరకు అత్య దికంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 86. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
(5 / 7)
బుధ వారం సింహాద్రిపురం (వైఎస్సార్) లో 40.7, గుల్ల దుర్తి (నంద్యాల), నేమకల్లు (కర్నూలు)లో 40.6, కాకాని (పల్నాడు)లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. గురువారం (08-05-25) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
(Photo Source From unsplash.com)(6 / 7)
గురువారం పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
(7 / 7)
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇతర గ్యాలరీలు