(1 / 8)
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు పూర్తి అయినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే… ఫలితాలను ప్రకటించనుంది.
(2 / 8)
తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తి అయిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియంతా కూడా పూర్తి కావటంతో… ఫలితాల వెల్లడికి విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది.
(3 / 8)
తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీతో పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 7వ తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ మొదలైంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. విద్యార్థుల జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి వాల్యూయేషన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే… జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు.
(4 / 8)
జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగానే కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పరిశీలించారు.ఈ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు సిద్ధమైంది.
(5 / 8)
ఫలితాల విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తేదీని ప్రకటించనున్నారు. ఈ ఒకటి రెండు రోజులు లేదా నెలాఖారులోపు ప్రకటించే అవకాశం ఉంది.
(6 / 8)
గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో…. ఈసారి టెన్త్ మార్కుల మెమోల ముద్రణ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది.
(7 / 8)
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ టెన్త్ ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. సింగిల్ క్లిక్ తో చెక్ చేసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే తెలంగాణ పదో తరగతి ఫలితాలపై నొక్కాలి. ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result లింక్ పై క్లిక్ చేసి క్షణాల్లోనే ఫలితాలను తెలుసుకోవచ్చు.
(8 / 8)
తెలంగాణ పదో తరగతి ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెసుకోవచ్చు గతేడాది ఏప్రిల్ 2తో పదో తరగతి ఎగ్జామ్స్ పూర్తి కాగా…. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఈసారి కూడా ఏప్రిల్ నెలఖారులోపే ప్రకటించే అవకాశం ఉంది. కుదరకపోతే మే మొదటి వారంలో రావొచ్చు.
ఇతర గ్యాలరీలు