(1 / 7)
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. మే 13వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది.
(istockphoto.com)(2 / 7)
మే 13వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మాత్రమే కాకుండా... ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
(istockphoto.com)(3 / 7)
సాధారణంగా జూన్ 1 లేదా మొదటి వారం నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా విస్తరించి… వర్షాలు కురుస్తుంటాయి. ఏపీ, తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి.
(istockphoto.com)(4 / 7)
జూన్ లో వచ్చే నైరుతి రుతుపవనాలు…. సెప్టెంబర్ మాసం రాకతో ఉపసంహరణ మొదలవుతుంది. అక్టోబరు నాటికి ముగుస్తుంది. అయితే నైరుతి రుతుపవనాల సమయంలో విస్తారంగా వర్షాలు కురిస్తే…. పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులకు చెక్ పడుతుంది.
(HT Telugu)(5 / 7)
ఈ ఏడాది రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు… విస్తారంగా వర్షాలు కురిస్తే…. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు తరలివచ్చే అవకాశం ఉంటుంది.
(istockphoto.com)(6 / 7)
మే 13వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ కు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే కేరళలోకి జూన్ కంటే ముందుగానే ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనిపై మే 3 వారం నాటికి వాతావరణశాఖ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
(istockphoto.com)ఇతర గ్యాలరీలు