"క్షణాల్లో అంతా జరిగిపోయింది"- దక్షిణ కొరియా విమాన ప్రమాదం లైవ్​ ఫొటోలు..-south korea plane crash in muan international airport live photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  "క్షణాల్లో అంతా జరిగిపోయింది"- దక్షిణ కొరియా విమాన ప్రమాదం లైవ్​ ఫొటోలు..

"క్షణాల్లో అంతా జరిగిపోయింది"- దక్షిణ కొరియా విమాన ప్రమాదం లైవ్​ ఫొటోలు..

Dec 29, 2024, 01:15 PM IST Sharath Chitturi
Dec 29, 2024, 01:15 PM , IST

  • దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచాన్ని షాక్​కు గురిచేసింది. ప్రమాదం సమయంలో 181 మంది విమానంలో ఉండగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం చివరి క్షణాలు రికార్డు అయ్యాయి. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

జెజు ఎయిర్​ విమానం బ్యాంకాక్​ నుంచి మువాన్​ నగరానికి తిరిగివచ్చింది. నగరంలోని విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్​ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో విమానం పేలిపోయింది.

(1 / 5)

జెజు ఎయిర్​ విమానం బ్యాంకాక్​ నుంచి మువాన్​ నగరానికి తిరిగివచ్చింది. నగరంలోని విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్​ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో విమానం పేలిపోయింది.

విమానం ల్యాండ్​ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఒక పక్షి దాన్ని ఢీకొట్టిందని, సరైన సమయంలో ల్యాండింగ్​ గేర్స్​ ఓపెన్​ అవ్వకపోవడంతో విమానం రన్​వై మీద కూలిపోయి ఈడ్చుకుంటూ వెళ్లి చివరికి ఒక గోడను ఢీకొట్టిందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.

(2 / 5)

విమానం ల్యాండ్​ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఒక పక్షి దాన్ని ఢీకొట్టిందని, సరైన సమయంలో ల్యాండింగ్​ గేర్స్​ ఓపెన్​ అవ్వకపోవడంతో విమానం రన్​వై మీద కూలిపోయి ఈడ్చుకుంటూ వెళ్లి చివరికి ఒక గోడను ఢీకొట్టిందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.

దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారు. వీరిలో 179మంది ప్రాణాలు కోల్పోయారు.

(3 / 5)

దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారు. వీరిలో 179మంది ప్రాణాలు కోల్పోయారు.(BNO NEWS)

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు విస్తృతస్థాయి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసి, విమానంలో నుంచి ఇద్దరిని బయటకు తీశారు. మిగిలిన వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.

(4 / 5)

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు విస్తృతస్థాయి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసి, విమానంలో నుంచి ఇద్దరిని బయటకు తీశారు. మిగిలిన వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.(AP)

ప్రయాణికుల్లో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని, మిగిలిన వారు దక్షిణ కొరియన్లని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

(5 / 5)

ప్రయాణికుల్లో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని, మిగిలిన వారు దక్షిణ కొరియన్లని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు