(1 / 5)
జెజు ఎయిర్ విమానం బ్యాంకాక్ నుంచి మువాన్ నగరానికి తిరిగివచ్చింది. నగరంలోని విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో విమానం పేలిపోయింది.
(2 / 5)
విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఒక పక్షి దాన్ని ఢీకొట్టిందని, సరైన సమయంలో ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో విమానం రన్వై మీద కూలిపోయి ఈడ్చుకుంటూ వెళ్లి చివరికి ఒక గోడను ఢీకొట్టిందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.
(3 / 5)
దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారు. వీరిలో 179మంది ప్రాణాలు కోల్పోయారు.
(BNO NEWS)(4 / 5)
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు విస్తృతస్థాయి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసి, విమానంలో నుంచి ఇద్దరిని బయటకు తీశారు. మిగిలిన వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
(AP)(5 / 5)
ప్రయాణికుల్లో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని, మిగిలిన వారు దక్షిణ కొరియన్లని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
(AP)ఇతర గ్యాలరీలు