(1 / 7)
వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులు పొడిగించింది. విశాఖ- తిరుపతి, భువనేశ్వర్- యశ్వంత్పూర్ మధ్య నడుస్తున్న రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
(2 / 7)
విశాఖ-తిరుపతి ( రైలు నం.08583) సర్వీస్ ప్రతి సోమవారం నడుస్తుంది. దీనిని మే 5 నుంచి జూన్ 30 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో (రైలు నం. 08584) మంగళవారం అందుబాటులో ఉంటుంది. జులై 1 వరకు ఈ సర్వీస్ గడువు పొడిగించారు. ఇది మొత్తం 18 ట్రిప్పులు నడపనున్నారు.
(3 / 7)
విశాఖ-తిరుపతి రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
(4 / 7)
భువనేశ్వర్-యశ్వంత్పూర్ (రైలు నం. 02811) రైలు మే 24 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణం (02812) ప్రతి సోమవారం జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మొత్తం 12 ట్రిప్పులు తిరుగుతుంది.
(5 / 7)
భువనేశ్వర్-యశ్వంత్ పూర్ రైలు ఖుర్దా రోడ్డు, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, ఎస్ఎస్ఎస్పీ నిలయం, హిందూపురం స్టేషన్లలో ఆపుతారు.
(6 / 7)
వేసవి రద్దీని దృష్ట్యా మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి పలు మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే నెల 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం (రైలు నం.07695), ప్రతి శుక్రవారం రామేశ్వరం నుంచి సికింక్రాబాద్ కు (రైలు నం.07696) ప్రత్యేక రైళ్లు నడు యని రైల్వే అధికారులు తెలిపారు.
ఇతర గ్యాలరీలు