వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాల్లో సర్వీసులు పొడిగింపు-south central railway to run 16 special trains in view of summer rush services extended on these routes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాల్లో సర్వీసులు పొడిగింపు

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాల్లో సర్వీసులు పొడిగింపు

Published Apr 22, 2025 06:41 PM IST Bandaru Satyaprasad
Published Apr 22, 2025 06:41 PM IST

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులు పొడిగించింది. విశాఖ- తిరుపతి, భువనేశ్వర్‌- యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తున్న రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులు పొడిగించింది. విశాఖ- తిరుపతి, భువనేశ్వర్‌- యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తున్న రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

(1 / 7)

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులు పొడిగించింది. విశాఖ- తిరుపతి, భువనేశ్వర్‌- యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తున్న రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

విశాఖ-తిరుపతి ( రైలు నం.08583) సర్వీస్ ప్రతి సోమవారం నడుస్తుంది. దీనిని మే 5 నుంచి జూన్‌ 30 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో (రైలు నం. 08584) మంగళవారం అందుబాటులో ఉంటుంది. జులై 1 వరకు ఈ సర్వీస్ గడువు పొడిగించారు. ఇది మొత్తం 18 ట్రిప్పులు నడపనున్నారు.

(2 / 7)

విశాఖ-తిరుపతి ( రైలు నం.08583) సర్వీస్ ప్రతి సోమవారం నడుస్తుంది. దీనిని మే 5 నుంచి జూన్‌ 30 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో (రైలు నం. 08584) మంగళవారం అందుబాటులో ఉంటుంది. జులై 1 వరకు ఈ సర్వీస్ గడువు పొడిగించారు. ఇది మొత్తం 18 ట్రిప్పులు నడపనున్నారు.

విశాఖ-తిరుపతి రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

(3 / 7)

విశాఖ-తిరుపతి రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

భువనేశ్వర్‌-యశ్వంత్‌పూర్‌ (రైలు నం. 02811) రైలు మే 24 నుంచి జూన్‌ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణం (02812) ప్రతి సోమవారం జూన్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మొత్తం 12 ట్రిప్పులు తిరుగుతుంది.

(4 / 7)

భువనేశ్వర్‌-యశ్వంత్‌పూర్‌ (రైలు నం. 02811) రైలు మే 24 నుంచి జూన్‌ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణం (02812) ప్రతి సోమవారం జూన్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మొత్తం 12 ట్రిప్పులు తిరుగుతుంది.

భువనేశ్వర్-యశ్వంత్ పూర్ రైలు ఖుర్దా రోడ్డు, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, ధర్మవరం, ఎస్‌ఎస్‌ఎస్‌పీ నిలయం, హిందూపురం స్టేషన్లలో ఆపుతారు.

(5 / 7)

భువనేశ్వర్-యశ్వంత్ పూర్ రైలు ఖుర్దా రోడ్డు, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, ధర్మవరం, ఎస్‌ఎస్‌ఎస్‌పీ నిలయం, హిందూపురం స్టేషన్లలో ఆపుతారు.

వేసవి రద్దీని దృష్ట్యా మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి పలు మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే నెల 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం (రైలు నం.07695), ప్రతి శుక్రవారం రామేశ్వరం నుంచి సికింక్రాబాద్ కు (రైలు నం.07696) ప్రత్యేక రైళ్లు నడు యని రైల్వే అధికారులు తెలిపారు.

(6 / 7)

వేసవి రద్దీని దృష్ట్యా మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి పలు మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే నెల 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం (రైలు నం.07695), ప్రతి శుక్రవారం రామేశ్వరం నుంచి సికింక్రాబాద్ కు (రైలు నం.07696) ప్రత్యేక రైళ్లు నడు యని రైల్వే అధికారులు తెలిపారు.

మే 12 నుంచి జూన్ 2 వరకు ప్రతి సోమవారం కాచిగూడ నుంచి మధురై (రైలు నం.07191)కు, మే 14 నుంచి జూన్ 4 వరకు ప్రతి బుధవారం రామేశ్వరం నుంచి కాచిగూడకు (రైలు నం.07192) ప్రత్యేకరైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

(7 / 7)

మే 12 నుంచి జూన్ 2 వరకు ప్రతి సోమవారం కాచిగూడ నుంచి మధురై (రైలు నం.07191)కు, మే 14 నుంచి జూన్ 4 వరకు ప్రతి బుధవారం రామేశ్వరం నుంచి కాచిగూడకు (రైలు నం.07192) ప్రత్యేకరైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు