AP Banana Export Train : అరబ్‌ దేశాలకు అనంత అరటి - తాడిపత్రి నుంచి 'బనానా రైలు' బయల్దేరింది..!-south central railway launches first banana export train from anantapur ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Banana Export Train : అరబ్‌ దేశాలకు అనంత అరటి - తాడిపత్రి నుంచి 'బనానా రైలు' బయల్దేరింది..!

AP Banana Export Train : అరబ్‌ దేశాలకు అనంత అరటి - తాడిపత్రి నుంచి 'బనానా రైలు' బయల్దేరింది..!

Published Nov 23, 2024 09:18 AM IST Maheshwaram Mahendra Chary
Published Nov 23, 2024 09:18 AM IST

  • Anantapur Banana Export Train : అనంతపురం అరటి చాలా ఫేమస్ అని తెలుసు. అయితే ఈ అరటి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి ప్రత్యేక రైలు(బనానా రైలు ) ముంబైకి బయల్దేరింది. ఇక్కడ్నుంచి షిప్ ద్వారా అరబ్ దేశాలకు పంపిస్తారు.

అరటి తోటలకు అనంతపురం చాలా ఫేమస్. అయితే ఈ పండ్లకు అంతర్జాతీయంగానూ మంచి పేరుంది. ఈ సీజన్ లో ఇక్కడి అరటి పంటను అరబ్ దేశాలకు తరలిస్తున్నారు.

(1 / 6)

అరటి తోటలకు అనంతపురం చాలా ఫేమస్. అయితే ఈ పండ్లకు అంతర్జాతీయంగానూ మంచి పేరుంది. ఈ సీజన్ లో ఇక్కడి అరటి పంటను అరబ్ దేశాలకు తరలిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో పండే ఈ పంట… ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్‌ వంటి అరబ్‌ దేశాలకు  ఎగుమతి కానుంది. కేవలం విమానాల్లో కాకుండా… జల రవాణా మార్గాల ద్వారా ఖండాంతరాలు దాటనుంది.

(2 / 6)

అనంతపురం జిల్లాలో పండే ఈ పంట… ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్‌ వంటి అరబ్‌ దేశాలకు  ఎగుమతి కానుంది. కేవలం విమానాల్లో కాకుండా… జల రవాణా మార్గాల ద్వారా ఖండాంతరాలు దాటనుంది.

జీ-9 అరటి రకం పంటను తరలించేందుకు తాడిపత్రి నుంచి శుక్రవారం ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  

(3 / 6)

జీ-9 అరటి రకం పంటను తరలించేందుకు తాడిపత్రి నుంచి శుక్రవారం ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  

34 బోగీల్లో 680 మెట్రిక్‌ టన్నులు అరటి పంటను రైలు ద్వారా ముంబైకి తరలించారు. ఈ సీజన్ లో ఇదే తొలి ట్రైన్ అని రైల్వే అధికారులు తెలిపారు.

(4 / 6)

34 బోగీల్లో 680 మెట్రిక్‌ టన్నులు అరటి పంటను రైలు ద్వారా ముంబైకి తరలించారు. ఈ సీజన్ లో ఇదే తొలి ట్రైన్ అని రైల్వే అధికారులు తెలిపారు.

ముంబై వరకి రైలు మార్గం ద్వారా చేరే ఈ అరటిని… అక్కడ్నుంచి ఓడల్లో రవాణా చేయనున్నారు. ఉద్యానశాఖ అధికారులు, ఎస్‌కే బనానా సంస్థ వారు ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు.

(5 / 6)

ముంబై వరకి రైలు మార్గం ద్వారా చేరే ఈ అరటిని… అక్కడ్నుంచి ఓడల్లో రవాణా చేయనున్నారు. ఉద్యానశాఖ అధికారులు, ఎస్‌కే బనానా సంస్థ వారు ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు.

అరబ్‌ దేశాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా పంపడం ఇది రెండోసారి. గతంలోనూ భారీ స్థాయిలో పంపారు. ఈసారి జిల్లా ఉద్యానవనశాఖ, ఎస్కే ఎక్స్ పోర్ట్స్, CONCOR, దక్షిణ మధ్య రైల్వే భాగస్వామ్యంతో అరటి పండ్లను తరలించే కార్యక్రమం చేపట్టారు.

(6 / 6)

అరబ్‌ దేశాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా పంపడం ఇది రెండోసారి. గతంలోనూ భారీ స్థాయిలో పంపారు. ఈసారి జిల్లా ఉద్యానవనశాఖ, ఎస్కే ఎక్స్ పోర్ట్స్, CONCOR, దక్షిణ మధ్య రైల్వే భాగస్వామ్యంతో అరటి పండ్లను తరలించే కార్యక్రమం చేపట్టారు.

ఇతర గ్యాలరీలు