Maha Shivaratri 2025 : తెలంగాణలోని ఏయే ఆలయాల్లో.. శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయో తెలుసా?
- Maha Shivaratri 2025 : శివరాత్రి రోజున భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శివరాత్రి రోజున తెలంగాణలోని కొన్ని ఆలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అవేంటో ఓసారి చూద్దాం.
- Maha Shivaratri 2025 : శివరాత్రి రోజున భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శివరాత్రి రోజున తెలంగాణలోని కొన్ని ఆలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అవేంటో ఓసారి చూద్దాం.
(1 / 6)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.
(2 / 6)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ కూడా శివరాత్రి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు.
(3 / 6)
హనుమకొండ నగరంలో ఉన్న వేయి స్తంభాల గుడి కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ కూడా శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ నుంచి భక్తులు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకుంటారు.
(4 / 6)
రంగారెడ్డి జిల్లాలో ఉన్న కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం.. అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్ నగరం సహా.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు.
(5 / 6)
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పాలమూరు నుంచే కాకుండా వివిధ జిల్లాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇతర గ్యాలరీలు