Prayagraj After Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025 తర్వాత ప్రయాగ్‌రాజ్ ఎలా కనిపిస్తుంది?-see how prayagraj mela grounds look after maha kumbh 2025 check in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Prayagraj After Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025 తర్వాత ప్రయాగ్‌రాజ్ ఎలా కనిపిస్తుంది?

Prayagraj After Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025 తర్వాత ప్రయాగ్‌రాజ్ ఎలా కనిపిస్తుంది?

Published Mar 02, 2025 10:02 AM IST Anand Sai
Published Mar 02, 2025 10:02 AM IST

  • Prayagraj After Maha Kumbh 2025 : మహా కుంభమేళా ముగిసింది. ఇప్పుడు ప్రయాగ్ రాజ్‌లో పారిశుద్ధ్య పనులు చురుకుగా సాగుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనాల్లో ఒకటైన మహా కుంభమేళాకు ఆతిథ్యమిచ్చిన ప్రయాగ్ రాజ్ ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చే పనిలో ఉంది. ఫిబ్రవరి 26న మహా కుంభమేళా ముగిసిన తర్వాత 15 రోజుల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

(1 / 7)

ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనాల్లో ఒకటైన మహా కుంభమేళాకు ఆతిథ్యమిచ్చిన ప్రయాగ్ రాజ్ ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చే పనిలో ఉంది. ఫిబ్రవరి 26న మహా కుంభమేళా ముగిసిన తర్వాత 15 రోజుల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

మహా కుంభమేళా ముగిసిన తరువాత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించారు. మేళా మైదానాలను శుభ్రపరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

(2 / 7)

మహా కుంభమేళా ముగిసిన తరువాత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించారు. మేళా మైదానాలను శుభ్రపరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక అధికారి ఆకాంక్ష రాణా ఆధ్వర్యంలో స్వచ్ఛతా మిత్రలు, గంగా సేవా దూతలు చురుకుగా పాల్గొంటున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

(3 / 7)

ప్రత్యేక అధికారి ఆకాంక్ష రాణా ఆధ్వర్యంలో స్వచ్ఛతా మిత్రలు, గంగా సేవా దూతలు చురుకుగా పాల్గొంటున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

రాబోయే 15 రోజుల్లో సంగం ఘాట్లు, మేళా గ్రౌండ్ రోడ్లు, శాశ్వత, తాత్కాలిక మౌలిక సదుపాయాలను శుభ్రపరుస్తామని ప్రత్యేక అధికారి ఆకాంక్ష రాణా వెల్లడించారు.

(4 / 7)

రాబోయే 15 రోజుల్లో సంగం ఘాట్లు, మేళా గ్రౌండ్ రోడ్లు, శాశ్వత, తాత్కాలిక మౌలిక సదుపాయాలను శుభ్రపరుస్తామని ప్రత్యేక అధికారి ఆకాంక్ష రాణా వెల్లడించారు.

మహా కుంభమేళాలో 66 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 15,000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు, 2,000 మంది గంగా సేవా దూతలు పరిశుభ్రతను పాటించడంలో కీలక పాత్ర పోషించారు.

(5 / 7)

మహా కుంభమేళాలో 66 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 15,000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు, 2,000 మంది గంగా సేవా దూతలు పరిశుభ్రతను పాటించడంలో కీలక పాత్ర పోషించారు.

మహా కుంభమేళా తర్వాత కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిరంతర పారిశుద్ధ్య ప్రయత్నాల అవసరాన్ని ముఖ్యమంత్రి యోగి నొక్కి చెప్పారు. మహా కుంభమేళా తర్వాత ఈ ప్రదేశాన్ని సందర్శించే యాత్రికులు మంచి వాతావరణం అనుభవించేలా చేస్తున్నారు.

(6 / 7)

మహా కుంభమేళా తర్వాత కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిరంతర పారిశుద్ధ్య ప్రయత్నాల అవసరాన్ని ముఖ్యమంత్రి యోగి నొక్కి చెప్పారు. మహా కుంభమేళా తర్వాత ఈ ప్రదేశాన్ని సందర్శించే యాత్రికులు మంచి వాతావరణం అనుభవించేలా చేస్తున్నారు.

మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన 1.5 లక్షల తాత్కాలిక మరుగుదొడ్లను స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తొలగించనున్నారు. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను క్రమపద్ధతిలో ప్రాసెస్ చేసి నైనిలోని బస్వర్ ప్లాంట్లో పారవేయనున్నారు.

(7 / 7)

మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన 1.5 లక్షల తాత్కాలిక మరుగుదొడ్లను స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తొలగించనున్నారు. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను క్రమపద్ధతిలో ప్రాసెస్ చేసి నైనిలోని బస్వర్ ప్లాంట్లో పారవేయనున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు