(1 / 7)
కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.
(2 / 7)
తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టిటిడి విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు.
(3 / 7)
ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు మూడు గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను శుక్రవారం సాయంత్రం మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.
(4 / 7)
ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రతా, సివిల్ పోలీసులకు, బాంబ్ స్క్వాడ్, రిజర్వ్ సిబ్బందికి, వైద్య, ఫైర్ సిబ్బందికి, రెవిన్యూ , ట్రాఫిక్ సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
(5 / 7)
దాదాపు రెండు గంటలపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 40 మంది ఆక్టోపస్ కమాండోలు, 10 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 13 ఏఆర్ సిబ్బంది, 12 మంది మెడికల్ సిబ్బంది, ఫైర్ , ఆర్మ్డ్ , బాంబ్ స్క్వాడ్, ఎలక్ట్రికల్ , వాటర్, గ్యాస్ శాఖల సిబ్బంది మాక్ డ్రిల్ లో భాగమయ్యారు.
(6 / 7)
ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ సి. రాజారెడ్డి, డిఎస్పీ మధుసుధన్ రావు ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టారు.
(7 / 7)
ఈ కార్యక్రమంలో టిటిడి విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పెహల్గాన్ ఉగ్రదాడి నేపథ్యంలో…. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత పెంచారు.
ఇతర గ్యాలరీలు