(1 / 7)
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. ధ్రువపత్రాల పరిశీలనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసింది.
(2 / 7)
తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ…. జూన్ 18 నుంచి ప్రారంభమవుతుందని టీజీపీఎస్సీ తెలిపింది. జూలై 18 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది.
(3 / 7)
హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్సిటీ)లో గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అలాగే.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
(4 / 7)
గ్రూప్ 3 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది.
(5 / 7)
అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.
(6 / 7)
అప్లికేషన్ ఫామ్,హాల్ టికెట్ పత్రం, ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాస్ పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ సర్వీస్ ఐడీ కార్డ్స్, పాన్ కార్డు, విద్యా అర్హత పత్రాలు, పదో తరగతి మెమో, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్, దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.
(7 / 7)
అభ్యర్థులు జూన్ 13వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఈ ప్రాసెస్ ను జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు