DC vs MI: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు
- DC vs MI: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ గాలిపటం మైదానంలోకి వచ్చింది. గాలిపటంతో కాసేపు ఎంజాయ్ చేశారు ముంబై స్టార్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆ వివరాలివే..
- DC vs MI: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ గాలిపటం మైదానంలోకి వచ్చింది. గాలిపటంతో కాసేపు ఎంజాయ్ చేశారు ముంబై స్టార్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆ వివరాలివే..
(1 / 7)
ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ గాలిపటం మైదానంలో వచ్చింది. నేడు (ఏప్రిల్ 27) ఢిల్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో గాలిపటం సడెన్గా ఎంట్రీ ఇచ్చింది.
(PTI)(2 / 7)
తన వద్దకు వచ్చిన గాలిపటాన్ని కీపింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు ఇచ్చాడు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. అయితే, మైదానంలోనే ఆ గాలిపటాన్ని ఎగరేసేందుకు పంత్ ప్రయత్నించాడు. కాసేపు దానితో ఆడుకున్నాడు.
(AP)(3 / 7)
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. ఈ గాలిపటం గ్రౌండ్లోకి వచ్చింది. దీంతో ఆటకు కాస్త అంతరాయం కలిగింది. అయితే, ఆ గాలిపటాన్ని పంత్ అందించాడు రోహిత్. పంత్ సరదాగా దాన్ని ఎగరేసేందుకు ట్రైచేశాడు.
(AP)(5 / 7)
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫ్రేజర్ మెక్గుర్క్ (27 బంతుల్లో 84 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది.
(PTI)(6 / 7)
లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసి.. ఓడిపోయింది. ఢిల్లీ విజయం సాధించింది.
(PTI)ఇతర గ్యాలరీలు