చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. మరో సెంచరీ బాదిన వికెట్ కీపర్.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్-rishabh pant creates history hits hundreds in both the innings kl rahul also hits hundred india vs england live score ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. మరో సెంచరీ బాదిన వికెట్ కీపర్.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్

చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. మరో సెంచరీ బాదిన వికెట్ కీపర్.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్

Published Jun 23, 2025 07:59 PM IST Hari Prasad S
Published Jun 23, 2025 07:59 PM IST

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. అంతేకాదు ఆండీ ఫ్లవర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్ అతడు.

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదాడు. దీంతో ఇంగ్లండ్ లో ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

(1 / 5)

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదాడు. దీంతో ఇంగ్లండ్ లో ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

(AP)

జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ తర్వాత ఒక టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గానూ పంత్ రికార్డు క్రియేట్ చేశాడు.

(2 / 5)

జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ తర్వాత ఒక టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గానూ పంత్ రికార్డు క్రియేట్ చేశాడు.

(AFP)

ఇంగ్లండ్ లో రిషబ్ పంత్ కు ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత రాహుల్ ద్రవిడ్ (6) పేరిట ఉంది.

(3 / 5)

ఇంగ్లండ్ లో రిషబ్ పంత్ కు ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత రాహుల్ ద్రవిడ్ (6) పేరిట ఉంది.

(AFP)

కేఎల్ రాహుల్ తో కలిసి రిషబ్ పంత్ టీమిండియాను తొలి టెస్టులో విజయం దిశగా నడిపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయమో లేదంటే డ్రా కావడమో తప్ప ఓడిపోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో 134 రన్స్ చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేశాడు. రాహుల్ తో కలిసి 4వ వికెట్ కు 195 రన్స్ జోడించడం విశేషం.

(4 / 5)

కేఎల్ రాహుల్ తో కలిసి రిషబ్ పంత్ టీమిండియాను తొలి టెస్టులో విజయం దిశగా నడిపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయమో లేదంటే డ్రా కావడమో తప్ప ఓడిపోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో 134 రన్స్ చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేశాడు. రాహుల్ తో కలిసి 4వ వికెట్ కు 195 రన్స్ జోడించడం విశేషం.

(AFP)

కేఎల్ రాహుల్ కూడా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ బాదాడు. అతడు 18 నెలల తర్వాత మూడంకెల స్కోరు అందుకోవడం విశేషం.

(5 / 5)

కేఎల్ రాహుల్ కూడా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ బాదాడు. అతడు 18 నెలల తర్వాత మూడంకెల స్కోరు అందుకోవడం విశేషం.

(AP)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు